Ayodhya Ram Naivedyam | అయోధ్య శ్రీరాముడికి అత్యంత ఖరీదైన మామిడి పండు నైవేద్యం

భగవంతుడిపై అచంచలమైన విశ్వాసంతో, తాను పండించిన అత్యంత విలువైన ఫలాన్ని శ్రీరాముడికి సమర్పించడం విశేషమని పేర్కొన్నారు.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Ayodhya Ram Naivedyam | అయోధ్యలో కొలువై ఉన్న శ్రీరామచంద్రుడికి ఓ భక్త రైతు సమర్పించిన విశేష కానుక భక్తులను ఆకట్టుకుంది. తాను ఎంతో శ్రద్ధతో పండించిన ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండును శ్రీరాముడికి నైవేద్యంగా సమర్పించి తన భక్తిని చాటుకున్నారు.

akshara today .jpgayodya

Ayodhya Ram Naivedyam | పండు ధర కిలోకు..

అంతర్జాతీయ మార్కెట్‌లో ఈ అరుదైన మామిడి పండు ధర కిలోకు సుమారు రూ.2.5 లక్షల వరకు ఉంటుందని చెబుతున్నారు. అత్యంత విలువైన ఈ పండును స్థానిక ఆధ్యాత్మిక సంప్రదాయాలకు అనుగుణంగా తులసి దళాలతో అలంకరించి సోమవారం ఆలయంలో శ్రీరాముడికి నైవేద్యంగా అర్పించారు.

ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తులు రైతు భక్తిని ప్రశంసించారు. భగవంతుడిపై అచంచలమైన విశ్వాసంతో, తాను పండించిన అత్యంత విలువైన ఫలాన్ని శ్రీరాముడికి సమర్పించడం విశేషమని పేర్కొన్నారు.

అయోధ్యలో జరిగిన ఈ అరుదైన ఘటన భక్తి, సంప్రదాయం, ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలుస్తూ భక్తుల హృదయాలను హత్తుకుంటోంది.

Phule Ambedkar Ideology | మేధో సంపత్తి గులాంగిరి ఇంకెన్నాళ్లు..? బ్లూ ప్రింట్​ ఇదిగో.. రండి.. బహుజన రాజ్యాధికారం చేజిక్కించుకుందాం!

Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *