అక్షరటుడే వెబ్డెస్క్: India US Trade Deal | భారత్ , అమెరికా దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం ఆగిపోయిందంటూ వస్తున్న కథనాలను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఖండించారు. ఈ మేరకు ఆయన ‘X’ వేదికగా స్పందిస్తూ, అమెరికా వాణిజ్య ప్రతినిధి జేమీసన్ గ్రీర్తో తమ చర్చలు చాలా సానుకూలంగా సాగాయని తెలిపారు. రైతులు, కార్మికులు , వినియోగదారులకు మేలు కలిగించేలా ఒక సమతుల్య ఒప్పందం కోసం రెండు దేశాలు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. భారత డిమాండ్లకు అమెరికా నుంచి సరైన స్పందన లేకపోవడంతో చర్చలు ప్రతిష్టంభనలో ఉన్నాయని ‘రాయిటర్స్’ వార్తా సంస్థ ఒక కథనాన్ని ప్రచురించింది. అయితే ఈ కథనాన్ని మంత్రి గోయల్ పూర్తిగా అవాస్తవమని కొట్టిపారేశారు.
India US Trade Deal | అధికారుల స్పష్టత..
వాణిజ్య ఒప్పంద చర్చల్లో ఎలాంటి అడ్డంకులు లేవని కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి రాజేష్ అగర్వాల్ వెల్లడించారు. ఇప్పటికే ఫ్రేమ్వర్క్ ఒప్పందం సిద్ధంగా ఉందని, సంతకాలు చేసేందుకు సరైన సమయం కోసం వేచి చూస్తున్నామని ఆయన తెలిపారు. ఇరు దేశాల బృందాలు పరస్పరం పర్యటించుకుంటూ చర్చలను ముందుకు తీసుకెళ్తున్నాయని వివరించారు.
India US Trade Deal | అమెరికా సైతం సానుకూలం..
ఈ ఒప్పందంపై అమెరికా అధికారులు కూడా సానుకూలంగా ఉన్నారని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మార్గరెట్ మాక్లియోడ్ పేర్కొన్నారు. త్వరలోనే తాత్కాలిక వాణిజ్య ఒప్పందం ఖరారు కానుందనే ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు. మొత్తానికి, వాణిజ్య ఒప్పందంపై వస్తున్న వదంతులకు కేంద్ర ప్రభుత్వం , అమెరికా అధికారులు అధికారికంగా సమాధానం చెప్పడంతో, ఈ ఒప్పందంపై కొనసాగుతున్న సందిగ్ధత తొలగిపోయినట్లయింది.
🤝 Commerce Minister Piyush Goyal has dismissed reports of a deadlock in India-US trade talks, calling them “completely false, baseless, and misleading.”
– The Reality: Goyal confirmed highly positive meetings with US Trade Representative Jamieson Greer, stating both nations are… pic.twitter.com/5jg6q9puWC
— Ved Singh (@tech_feed2023) July 13, 2026
ఇది కూడా చదవండి: Polavaram Banakacherla Link | గోదావరి నీళ్లను ఏపీకి తాకట్టు పెడుతున్నారు.. రేవంత్ సర్కార్పై కవిత ఫైర్