అక్షరటుడే, వెబ్డెస్క్ : Punjab Kings Playoffs | ఐపీఎల్ 2026 సీజన్లో అక్షర్ పటేల్ నాయకత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్ (DC)కు మరోసారి నిరాశే ఎదురైంది. శనివారం రాత్రి జరిగిన కీలక మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG)పై పంజాబ్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించడంతో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేఆఫ్స్ అవకాశాలు పూర్తిగా ముగిశాయి.
కోల్కతా నైట్ రైడర్స్తో మే 25న ఢిల్లీ తన చివరి లీగ్ మ్యాచ్ ఆడాల్సి ఉన్నప్పటికీ, ఆ మ్యాచ్కు ముందే టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. ఈ సీజన్లో ఎలిమినేట్ అయిన నాలుగో జట్టుగా ఢిల్లీ క్యాపిటల్స్ నిలిచింది. లక్నో-పంజాబ్ (Punjab Kings Playoffs) మ్యాచ్కు ముందు ఢిల్లీ అభిమానులు లక్నో విజయం కోసం ఎదురుచూశారు. ఎందుకంటే అప్పటికే ఢిల్లీ 13 మ్యాచ్ల్లో 12 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది. చివరి మ్యాచ్లో భారీ తేడాతో గెలిచినా జట్టు గరిష్టంగా 14 పాయింట్లకు మాత్రమే చేరుకునే అవకాశం ఉండేది. కానీ పంజాబ్ విజయం సాధించడంతో వారు 15 పాయింట్లతో నేరుగా టాప్-4లోకి దూసుకెళ్లారు. దీంతో ఢిల్లీకి మిగిలిన అన్ని అవకాశాలు ఒక్కసారిగా ముగిశాయి.
Punjab Kings Playoffs | చెదిరిన ఢిల్లీ కల..
ఈ సీజన్ను ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) ఎంతో ఆశాజనకంగా ప్రారంభించింది. తొలి మ్యాచ్లలో లక్నో, ముంబై ఇండియన్స్లపై వరుస విజయాలతో జట్టు మంచి ఆత్మవిశ్వాసంతో కనిపించింది. అయితే గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో ఎదురైన అనూహ్య పరాజయం జట్టు ప్రయాణానికి మొదటి దెబ్బగా మారింది. చివరి క్షణాల్లో కేవలం ఒక్క పరుగు తేడాతో ఓటమి పాలవడం ఢిల్లీపై తీవ్ర ప్రభావం చూపించింది. ఆ తర్వాత మిడ్ సీజన్లో ఢిల్లీ పూర్తిగా లయ కోల్పోయింది. వరుసగా మూడు మ్యాచ్ల్లో ఓడిపోవడం జట్టును తీవ్ర ఒత్తిడిలోకి నెట్టింది. ముఖ్యంగా పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 264 పరుగుల భారీ స్కోరు చేసినప్పటికీ, బౌలర్లు ఆ లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయారు. పంజాబ్ బ్యాటర్లు ఆ టార్గెట్ను ఛేదించడంతో ఢిల్లీ ఆత్మవిశ్వాసానికి భారీ దెబ్బ తగిలింది. ఆ ఓటమి తర్వాత జట్టు వరుస పరాజయాలతో ఎలిమినేషన్ అంచుకు చేరింది.
Punjab Kings Playoffs | చివరి దశలో..
చివరి దశలో వరుస విజయాలతో రేసులోకి తిరిగి రావడానికి ఢిల్లీ ప్రయత్నించినప్పటికీ, ఇతర మ్యాచ్ల ఫలితాలు వారికి అనుకూలంగా మారలేదు. పంజాబ్-లక్నో మ్యాచ్తో ఢిల్లీ ఆశలకు అధికారికంగా తెరపడింది. ఈ ఫలితంతో ఢిల్లీ క్యాపిటల్స్ టైటిల్ నిరీక్షణ మరో ఏడాది పాటు కొనసాగనుంది. వరుసగా ఐదో సారి ప్లేఆఫ్స్కు చేరడంలో విఫలమైన ఢిల్లీ, చివరిసారిగా 2021 సీజన్లో టాప్-4లో స్థానం సంపాదించింది. ఐపీఎల్ చరిత్రలో అన్ని సీజన్లు ఆడినప్పటికీ, కేవలం ఆరు సార్లు మాత్రమే ప్లేఆఫ్స్కు అర్హత సాధించడం జట్టు అభిమానులను మరింత నిరాశకు గురిచేస్తోంది. ఇక ప్లే ఆఫ్స్కి ఇప్పటికే ఆర్సీబీ,జీటీ, ఎస్ఆర్హెచ్ SRH జట్లు చేరుకోగా, నాలుగో స్థానం ఎవరిది అనే దానిపై ఈ రోజు మధ్యాహ్నంతో క్లారిటీ రానుంది.
దీనిని కూడా చదవండి : SRH vs RCB | IPL 2026: హైదరాబాద్ భారీ లక్ష్యం.. పవర్ప్లేలోనే ఆర్సీబీ కీలక వికెట్లు డౌన్!


