అక్షరటుడే, వెబ్డెస్క్ : Cockroach Janata Party Protest | ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. నీట్ పరీక్ష (NEET Exam) పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. సోషల్ మీడియా పార్టీ కాక్రోచ్ జనతా పార్టీకి యువత నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. ఈ క్రమంలో ఇటీవల ఢిల్లీలో పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. తాజాగా హైదరాబాద్లోని ధర్నా చౌక్లో నిరసన చేపట్టారు. ఆందోళనలో పాల్గొనేందుకు సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్, సీజేపీ అధికార ప్రతినిధి విజేత దహియా సైతం రానున్నారు.
Cockroach Janata Party Protest | రాజీనామా చేయాలని డిమాండ్
కాక్రోచ్ జనతా పార్టీ నిరసనకు పెద్ద ఎత్తున యువత తరలి వచ్చారు. పేపర్ లీకులకు బాధ్యత తీసుకొని కేంద్ర మంత్రి ధర్మేంద ప్రధాన్ రాజీనామా చేయాలంటూ వారు డిమాండ్ చేశారు. ‘రాజ్యాంగం జిందాబాద్’ అంటూ యువకులు, విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఇందిరాపార్క్ వద్ద ‘కాక్రోచ్’ల ధర్నా
HYD: ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళనలో పాల్గొనేందుకు సామాజిక… pic.twitter.com/Oo3x8UvzFH
— Akshara Today | Telugu News (@aksharatoday) June 14, 2026
దీనిని కూడా చదవండి : Jnaneshwari Missing Case | చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్