అక్షరటుడే వెబ్డెస్క్: Modi Japan Meeting | భారత ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్ ప్రధాని సనాయే టకైచి గురువారం న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య ఉన్న ప్రత్యేక వ్యూహాత్మక , అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని మరింత దృఢతరం చేయడమే లక్ష్యంగా ఈ ద్వైపాక్షిక చర్చలు జరిగాయి.
Modi Japan Meeting | చర్చల్లో కీలక అంశాలు..
ఈ సమావేశంలో భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్తో పాటు ఇరు దేశాలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పరస్పర ప్రయోజనాలు, ప్రాంతీయ పరిణామాలు , ప్రస్తుత ప్రపంచ పరిస్థితులపై ప్రధానులిద్దరూ సుదీర్ఘంగా చర్చించినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
Modi Japan Meeting | జపాన్ ప్రధాని తొలి భారత పర్యటన..
జపాన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సనాయే టకైచి భారత్లో పర్యటించడం ఇదే మొదటిసారి. ఆమె మూడు రోజుల అధికారిక పర్యటనలో భాగంగా భారత్కు వచ్చారు. త్వరలో జరగనున్న ’16వ భారత్-జపాన్ వార్షిక సదస్సు’కు ముందు ఈ పర్యటన జరగడం ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆ సదస్సులో ఇరు దేశాల మధ్య సహకారానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

Modi Japan Meeting | మరింత బలపడుతున్న ద్వైపాక్షిక బంధం..
భారత్-జపాన్ సంబంధాలను విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ఒక ప్రత్యేకమైన బంధంగా అభివర్ణించింది. పరస్పర నమ్మకం, ఉమ్మడి విలువల పునాదిపై ఈ భాగస్వామ్యం భవిష్యత్తులో మరింత బలోపేతం కానుందని తెలిపింది. భారత్తో బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి జపాన్ ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని ఈ పర్యటన ద్వారా స్పష్టమవుతోంది.
#WATCH | Delhi: Prime Minister Narendra Modi and Prime Minister of Japan, Sanae Takaichi hold delegation level talks at Hyderabad House.
(Source: DD News) pic.twitter.com/UeoPV1TZXT
— ANI (@ANI) July 2, 2026
ఇది కూడా చదవండి: AMRUT 2.0 Works | అమృత్ 2.0 పనులను త్వరగా పూర్తి చేయాలి.. కలెక్టర్