అక్షరటుడే, వెబ్డెస్క్: Amrit Bharat Express | తెలంగాణ రైల్వే ప్రయాణికులకు ఇది గుడ్ న్యూస్. మరో కొత్త అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ట్రెయిన్ అందుబాటులోకి వచ్చింది. జార్ఖండ్లోని ధన్బాద్ నుంచి తమిళనాడులోని కోయంబత్తూరు వరకు 22363/22364 అమృత్ భారత్ వీక్లీ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ సర్వీసును రైల్వే శాఖ ప్రారంభించింది.
Amrit Bharat Express | ధన్బాద్ టు కోయంబత్తూర్
ఈ రైలు బీహార్లోని గయా మీదుగా నడుస్తుంది. తిరుపతికి సమీపంలోని రేణిగుంట జంక్షన్ మీదుగా కోయంబత్తూరు చేరుకుంటుంది. దీంతో ఉత్తర భారత్ నుంచి తిరుపతి ప్రాంతానికి వెళ్లే ప్రయాణికులకు మరో కొత్త కనెక్టివిటీ అందుబాటులోకి వచ్చింది.
Amrit Bharat Express | తెలంగాణలో పలు స్టేషన్ల మీదుగా..
ఈ అమృత్ భారత్ రైలుకు తెలంగాణలోని సిర్పూర్ కాగజ్నగర్, మంచిర్యాల, పెద్దపల్లి, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం స్టేషన్లలో స్టాప్లు కల్పించారు. ఈ రైలు ధన్బాద్ నుంచి ప్రతి శనివారం సాయంత్రం 4:10 గంటలకు బయలుదేరి సోమవారం కోయంబత్తూరు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో కోయంబత్తూరు నుంచి ప్రతి మంగళవారం ఉదయం 7:50 గంటలకు బయలుదేరుతుంది. రెగ్యులర్ సర్వీస్ ధన్బాద్ నుంచి ఆగస్టు 22న ప్రారంభమైంది.
ఇది కూడా చదవండి..: Sumanth Driver Arrest | మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్ అరెస్ట్