అక్షరటుడే వెబ్డెస్క్: Supreme Court Protests | శాంతియుత నిరసనలు తెలిపే యువ విద్యార్థుల పట్ల అధికారులు, భద్రతా దళాలు అత్యంత సంయమనం పాటించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. హింసను అదుపు చేసేందుకు బలగాలతో హింసాత్మకంగా ప్రతిస్పందించడం వల్ల పరిస్థితి మరింత దిగజారుతుందని అత్యున్నత ధర్మాసనం అభిప్రాయపడింది. భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది.
Supreme Court Protests | హింసాత్మక ఘటనలపై..
జంతర్మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నిర్వహించిన నిరసనల సమయంలో జరిగిన రాళ్లదాడి, హింసాత్మక ఘటనలపై దాఖలైన పిటిషన్ను విచారిస్తూ కోర్టు ఈ స్పష్టతనిచ్చింది. ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా మార్చ్లు చేసే యువత పట్ల భద్రతా దళాలు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని, వారిని రెచ్చగొట్టి హింస వైపు మళ్లకుండా చూడాలని సీజేఐ పేర్కొన్నారు.
Supreme Court Protests | వారి డిమాండ్లను వినడమే సరైన మార్గం..
ఆందోళన చేస్తున్న యువత ఎందుకు నిరసన తెలుపుతున్నారు? వారు ఏం చెబుతున్నారో ఓపికగా వినడమే అత్యంత శక్తివంతమైన పరిష్కారమని సుప్రీం ధర్మాసనం సూచించింది. అదేవిధంగా దిల్లీతో పాటు దేశవ్యాప్తంగా విద్యార్థుల నిరసనల్లో హింసకు సంబంధించి పెండింగ్లో ఉన్న ఇతర పిటిషన్లతో ఈ అంశాలను కూడా జతచేసి విచారిస్తామని, కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి: HYDRAA Forgery Case | హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ