అక్షరటుడే, వెబ్డెస్క్: Nitin Gadkari | ఓవైపు వాయు కాలుష్యంపై పెరుగుతున్న ఆందోళనలు, మరోవైపు భారంగా మారిన శిలాజ ఇంధనాల దిగుమతుల కారణంగా పెట్రోల్, డీజిల్ వాహనాలకు భవిష్యత్తు లేదని కేంద్ర రోడ్డు, రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు.
మంగళవారం జరిగిన బస్ వరల్డ్ ఇండియా 2026 కాంక్లెవ్ లో ఆయన భారతదేశం యొక్క రూ. 22 లక్షల కోట్ల శిలాజ ఇంధన దిగుమతుల బిల్లును హైలైట్ చేస్తూ హైడ్రోజన్ను ‘భవిష్యత్తు ఇంధనం’ అని అభివర్ణించారు. ఆటో సరఫరా గొలుసులో ప్రత్యామ్నాయ ఇంధనాలు గణనీయమైన వాటాను దక్కించుకోగలవా అనే దానిపై విస్తృత చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
Nitin Gadkari | ఓఈఎంలకు హెచ్చరిక..
కాలుష్యం, భారీ ఇంధన దిగుమతుల భారం వల్ల పెట్రోల్, డీజిల్ వంటి వాటికి భవిష్యత్తు లేదని, వెంటనే హైడ్రోజన్, ఇథనాల్, ఎలక్ట్రిక్ (Electric) వైపు మళ్లాలని కేంద్ర మంత్రి గడ్కరీ (Union Minister Gadkari) పేర్కొన్నారు. ఒరిజినల్ ఎక్విప్మెంట్ మాన్యుఫ్యాక్చరర్స్ (ఓఈఎం)లను ఉద్దేశించి ఆయన నేరుగా ఈ వ్యాఖ్యలు చేశారు. ‘డీజిల్, పెట్రోల్ వాహనాలకు భవిష్యత్తు లేదు. మీరు కేవలం ఆ దిశలోనే విస్తరించాలని యోచిస్తుంటే.. మీ భవిష్యత్ బాగుండదు అని ఓ మిత్రుడిగా నేను చెప్పగలను’ అని వ్యాఖ్యానించారు. శిలాజ ఇంధనాల నుంచి స్వచ్ఛమైన ప్రత్యామ్నాయాల వైపు మారే విషయాన్ని పరిశీలించాలని కోరారు.
Nitin Gadkari | కాలుష్య సమస్య కూడా..
‘మనం రూ. 22 లక్షల కోట్ల విలువైన శిలాజ ఇంధనాలను దిగుమతి చేసుకుంటున్నాం. ఇది కేవలం ఆర్థిక సవాల్ మాత్రమే కాదు. ఒక పెద్ద కాలుష్య సమస్య కూడా. మా విధానం దిగుమతులకు ప్రత్యామ్నాయం, తక్కువ ఖర్చుతో కూడుకున్న, కాలుష్య రహితమైన స్వదేశీ ఇంధనాలు,’ అని గడ్కరీ అన్నారు. 2025 ఆర్థిక సంవత్సరంలో, భారతదేశం సుమారు 242.4 మిలియన్ టన్నుల ముడి చమురు (Crude oil)ను దిగుమతి చేసుకుంది. దిగుమతులపై ఆధారపడడం దాదాపు 89 శాతంగా ఉంది. స్వదేశీ, దిగుమతి ప్రత్యామ్నాయ ఇంధనాలపై గడ్కరీ నొక్కిచెప్పడం వెనుక ఉన్న హేతుబద్ధతను ఇది బలపరుస్తోంది.
Nitin Gadkari | ఇథనాల్ ఒక ప్రత్యామ్నాయం..
దేశంలో ఇథనాల్ (Ethanol) విప్లవం కూడా ఊపందుకుంటోంది. చెరుకు, మక్క, నూకల నుంచి తయారయ్యే ఇథనాల్ను 20 శాతం వరకు పెట్రోల్లో కలిపే లక్ష్యాన్ని (ఈ20) భారత్ ఇప్పటికే అందుకుంది. ఇప్పుడు గడ్కరీ చూపు ఈ85 మరియు ఈ100 పై ఉంది. అంటే భవిష్యత్తులో వాహనాలు కేవలం ఇథనాల్ తోనే నడిచే రోజులు దగ్గరలోనే ఉన్నాయని తెలుస్తోంది.
Nitin Gadkari | భవిష్యత్ ఇంధనంగా హైడ్రోజన్ ..
ఈ సదస్సులో గడ్కరీ హైడ్రోజన్ను ‘భవిష్యత్ ఇంధనం’గా అభివర్ణిస్తూ, మంత్రిత్వ శాఖ హైడ్రోజన్ ట్రక్కులు, బస్సులతో పైలట్ ప్రాజెక్టులను ప్రారంభించిందని వెల్లడించారు. టాటా మోటార్స్, వోల్వో, ఇండియన్ ఆయిల్, బీపీసీఎల్, ఎన్ టీపీసీల సహకారంతో చేపట్టిన ఈ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా 10 మార్గాలలో విస్తరించి ఉన్నాయన్నారు. ఈ హైడ్రోజన్ పైలట్ ప్రాజెక్టులు గ్రేటర్ నోయిడా -ఢిల్లీ -ఆగ్రా, పూణే -ముంబయి, తిరువనంతపురం -కొచ్చి వంటి 10 కారిడార్లను కవర్ చేస్తాయని, వీటికి జాతీయ హరిత హైడ్రోజన్ మిషన్ కింద తొమ్మిది రీఫ్యూయలింగ్ స్టేషన్లు, సుమారు రూ.500 కోట్ల బడ్జెట్ మద్దతు ఉందని ఆయన తెలిపారు. ‘పెట్రోల్, డీజిల్ వాహనాలకు ఇక భవిష్యత్తు లేదు’ అంటూ గడ్కరీ చేసిన ప్రకటన ఒక హెచ్చరిక మాత్రమే కాదు, రాబోయే ఐదేళ్లలో మన రోడ్ల మీద కనిపించే వాహనాల రూపురేఖలు ఎలా మారబోతున్నాయో చెప్పే ఒక రోడ్ మ్యాప్ అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇది కూడా చదవండి..: Delhi High Court | ఢిల్లీ హైకోర్టులో షాకింగ్ ఘటన.. జడ్జిల ముందే అశ్లీల వీడియోల కలకలం!

