అక్షరటుడే వెబ్డెస్క్:Smart Policing Malkajgiri|మల్కాజ్గిరి కమిషనరేట్లో స్మార్ట్, పౌర-కేంద్రీకృత పోలీసింగ్ శకానికి మే 1, 2026న బాధ్యతలు స్వీకరించిన సీనియర్ ఐపీఎస్ అధికారిణి బడుగుల సుమతి శ్రీకారం చుట్టారు. సాంకేతికతను మానవతా దృక్పథంతో జోడించి ఆమె రూపొందించిన మార్గసూచి భవిష్యత్ పోలీసింగ్కు ఒక ఆదర్శంగా నిలుస్తోంది.
Smart Policing Malkajgiri|అర్థరాత్రి ‘స్టింగ్ ఆపరేషన్’..
నగరంలో మహిళలు ఎదుర్కొంటున్న వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు సీపీ సుమతి ఒక సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. అర్థరాత్రి 12:30 నుండి 3:30 గంటల మధ్య దిల్సుఖ్నగర్ బస్టాండ్ వద్ద ఒక సామాన్య మహిళలా ఒంటరిగా నిలబడి క్షేత్రస్థాయి పరిస్థితులను స్వయంగా సమీక్షించారు. ఆ మూడు గంటల వ్యవధిలో సుమారు 40 మంది పోకిరీలు ఆమె వద్దకు వచ్చి అసభ్యకరంగా ప్రవర్తించారు. మద్యం, గంజాయి మత్తులో ఉన్న పోకిరీలను, విద్యార్థులను అక్కడికక్కడే పట్టుకుని ఆమె స్వయంగా కౌన్సెలింగ్ ఇచ్చారు. మహిళల పట్ల ప్రవర్తించాల్సిన తీరుపై వారికి గట్టిగా హెచ్చరించారు. ఇలాంటి ఆపరేషన్ చేయడం ఆమెకు ఇది మొదటిసారి కాదు. 25 ఏళ్ల క్రితం కాజీపేటలో కూడా ఇలాంటి సాహసమే చేశారు.
Smart Policing Malkajgiri|వృత్తిలో ఆమె వినూత్న శైలి ..
ప్రజల నమ్మకాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఆమె తన కార్యాచరణను రూపొందించారు. ఆధునిక నేరాలను ఎదుర్కోవడానికి ‘టీజీ క్వెస్ట్’ వంటి ఏఐ సాధనాలను , సాంకేతికతను పోలీసింగ్ వ్యవస్థలో అనుసంధానించనున్నారు. పెరుగుతున్న డిజిటల్ ముప్పులను అరికట్టడానికి ‘ఫలితాల ఆధారిత వ్యూహాన్ని’ అమలు చేయడంతో పాటు ప్రజల్లో అవగాహన కల్పించనున్నారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై ‘సున్నా సహనం’ (Zero Tolerance) విధానాన్ని పాటిస్తూ, యువతను కాపాడటమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు.
Smart Policing Malkajgiri|గతంలో పని చేసిన స్థానాల్లో కీలక నిర్ణయాలు..
సుమతి తన రెండు దశాబ్దాలకు పైగా కెరీర్లో ఎన్నో కీలక విజయాలను అందుకున్నారు.
జీరో స్ట్రాటజీ: ఆమె ప్రవేశపెట్టిన ‘జీరో స్ట్రాటజీ’ ద్వారా మావోయిస్టులను చంపడం కంటే లొంగిపోయేలా చేసి సమాజంలో కలిపేందుకు కృషి చేశారు. ఆమె వ్యూహం వల్ల 591 మంది మావోయిస్టులు లొంగిపోయారు. మహిళా రక్షణ సెల్ (CID) లో పనిచేస్తూ ‘భరోసా కేంద్రాల’ను బలోపేతం చేసి, బాధితులకు తక్షణ న్యాయం జరిగేలా చూశారు.
స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (SIB)లో మొదటి మహిళా ఐజీగా పని చేసి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు పొందారు.
జోగులాంబ గద్వాల్ జిల్లాకు చెందిన సుమతి , 2001లో మొట్టమొదటి మహిళా DSPగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ఇప్పటివరకు వరకు తన అంకితభావంతో ఎందరో మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. పారదర్శకత, జవాబుదారీతనం , పౌర స్నేహపూర్వక పోలీసింగ్తో మల్కాజ్గిరిలో సరికొత్త మార్పులకు ఆమె శ్రీకారం చుట్టారు.
ఇది కూడా చదవండి: Bengal Political Crisis|మే 9న కొత్త సర్కార్.. మమత పట్టుదలకు ఈసీ నోటిఫికేషన్తో బ్రేక్!

