అక్షరటుడే వెబ్డెస్క్:Bengal Political Crisis|పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ ప్రతిష్టంభన కొత్త మలుపు తిరిగింది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన పదవికి రాజీనామా చేయడానికి నిరాకరించడంతో రాజకీయ వాతావరణం వేడెక్కిన తరుణంలో, భారత ఎన్నికల సంఘం (ECI) సంచలన నిర్ణయం తీసుకుంది.
Bengal Political Crisis|నూతన అసెంబ్లీ ఏర్పాటుకు నోటిఫికేషన్..
రాష్ట్రంలో కొత్త శాసనసభ ఏర్పాటుకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం నేడు అధికారిక నోటిఫికేషన్ను జారీ చేసింది. ఈ కాన్స్టిట్యూషన్ ఆఫ్ న్యూ అసెంబ్లీ నోటిఫికేషన్ను అధికారులు వెంటనే బెంగాల్ గవర్నర్కు పంపారు. దీనితో రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ అధికారికంగా ముగిసినట్లు ప్రకటించారు.
Bengal Political Crisis|కొత్త ఎమ్మెల్యేల జాబితా గవర్నర్ వద్దకు..
ఈ నోటిఫికేషన్ విడుదలతో గెలిచిన కొత్త ఎమ్మెల్యేల జాబితా ఇప్పుడు గవర్నర్ వద్దకు చేరుతుంది. రాజ్యాంగబద్ధంగా శాసనసభలో అత్యధిక స్థానాలు సాధించిన పార్టీని లేదా కూటమిని ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా ఆహ్వానించే పూర్తి అధికారం ఇప్పుడు గవర్నర్కు లభిస్తుంది.
Bengal Political Crisis|మమతా బెనర్జీకి కోలుకోలేని దెబ్బ..
మరోవైపు, పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా బీజేపీ అడుగులు వేగవంతం చేసింది. అమిత్ షా వంటి అగ్రనేతలను పర్యవేక్షకులుగా నియమించి, మే 9న ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటోంది. సరిగ్గా ఇదే సమయంలో ఈసీ నోటిఫికేషన్ విడుదల కావడం గమనార్హం. పదవిని వదలడానికి ఇష్టపడని మమతా బెనర్జీకి ఈ పరిణామం కోలుకోలేని దెబ్బ అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో బెంగాల్లో కొత్త ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ ఇకపై మరింత వేగంగా సాగే అవకాశం కనిపిస్తోంది.
ఇది కూడా చదవండి: Paddy Farmers | ప్రాణాలు పోతున్న పట్టదా.. కొనుగోలు కేంద్రాల్లో చనిపోతున్న రైతులు

