Bhayandar Vasai Bridge | డబుల్ డెక్కర్ వంతెన నిర్మాణానికి ముందడుగు.. 39 నుంచి 5 కి.మీ.లకు తగ్గనున్న దూరం

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bhayandar Vasai Bridge | మహారాష్ట్ర (Maharashtra)లోని భయందర్ – వసాయి మధ్య వంతెన నిర్మాణం ప్రతిపాదనలకే పరిమితమవుతూ వస్తోంది. ఈ ప్రాజెక్ట్ 2000 సంవత్సరంలో మొదటిసారిగా ప్రతిపాదించబడింది. 2013లో మహారాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇది డబుల్ డెక్కర్ వంతెన. పైఅంతస్తు రోడ్డు రవాణాకు, కింది అంతస్తు మెట్రో లైన్ (మెట్రో-13) రాకపోకలకు ఉపయోగపడుతుంది.

చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న భయందర్ – వసాయిలను కలిపే వంతెన నిర్మాణానికి సంబంధించిన ప్రణాళిక అమలు దిశగా అడుగులు పడుతున్నాయి. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ గత వారం రాష్ట్ర పట్టణాభివృద్ధి విభాగానికి ఒక కొత్త ప్రతిపాదనను సమర్పించింది. రూ. 2,500 కోట్ల అంచనా వ్యయంతో 5 కి.మీ. మేర డబుల్ డెక్కర్ వంతెనను నిర్మించాలని నిర్ణయించారు.

Bhayandar Vasai Bridge | 18 లక్షల మందికి మేలు..

ప్రస్తుతం వసాయి నుంచి భయందర్ కు 48 వ నంబర్ జాతీయ రహదారి మీదుగా తిరిగి వెళ్లాల్సి వస్తోంది. సుమారు 39 కిలోమీటర్ల దూరానికి 90 నిమిషాల సమయం పడుతోంది. ఈ వంతెన నిర్మాణం పూర్తయితే దూరం 5 కి.మీటర్లకు తగ్గుతుంది. ప్రయాణ సమయం 10 నిమిషాలకు కుదించబడుతుంది. దీంతో వసాయి – భయందర్ ప్రాంతంలోని సుమారు 18 లక్షల మందికి ఉపశమనం లభిస్తుంది.

Bhayandar Vasai Bridge | అనుమతులు లభించేనా?

ఈ వంతెన అంచనా వ్యయం రూ. 2,500 కోట్లు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి అవసరమైన ఐదు ప్రభుత్వ అనుమతులలో ఇప్పటికే మహారాష్ట్ర మారిటైమ్ బోర్డ్, ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా మరియు మహారాష్ట్ర కోస్టల్ జోన్ మేనేజ్‌మెంట్ అథారిటీ నుంచి అనుమతులు లభించాయి. మడ అడవుల భూమి, ఉప్పునీటి మడుల భూమిని సేకరించాల్సి ఉన్నందున వరుసగా రాష్ట్ర అటవీ శాఖ మరియు కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఉప్పు కమిషనర్ నుండి ఇంకా అనుమతి పొందాల్సి ఉంది.

ప్రాజెక్ట్ కోసం ఉప్పు మడుల భూమిని సేకరించడానికి ముందు, ఆ భూమిలో నివసిస్తున్న ఉప్పు ఉత్పత్తిదారులకు నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఉప్పు మడులపై ఆధారపడి పది కుటుంబాలకు చెందిన 119 మంది జీవిస్తున్నారు. తరతరాలుగా తాము సాగు చేస్తున్న భూములపై హక్కులను క్లెయిమ్ చేశారు. 2013లో బాధితుల కుటుంబాలు బాంబే హైకోర్టు (Bombay High Court)ను ఆశ్రయించాయి. అయితే నష్టపరిహారం విషయమై ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు. వంతెన నిర్మాణానికి అటవీ శాఖ పరిధిలోకి వచ్చే మడ అడవుల భూమికి బదులుగా దహను తాలూకాలోని వడపోఖరన్‌లో 4.44 హెక్టార్లకు సమానమైన భూమిని ఇవ్వడానికి అధికారులు ప్రతిపాదించారు. ఈ రెండు అంశాలు తేలితే ప్రాజెక్ట్ ముందుకు సాగనుంది.

ఇది కూడా చదవండి..: Vijay Tamil Nadu|మేజిక్ ఫిగర్ దాటేసిన టీవీకే.. సీఎం పీఠం దిశగా దళపతి!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *