అక్షరటుడే, వెబ్డెస్క్ : HDFC Bank | అమెరికా, ఇరాన్ల మధ్య యుద్ధం కారణంగా క్రూడ్ ఆయిల్ (Crude Oil) ధరలకు రెక్కలు రావడంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు పెరిగాయి. దీంతో ఆయా దేశాలు పొదుపు చర్యలు చేపడుతున్నాయి. 85 శాతానికిపైగా క్రూడ్ ఆయిల్ను దిగుమతిపై ఆధారపడిన మన దేశంలోనూ పొదుపు చర్యలు చేపట్టాల్సిన ఆవశ్యకతను ఇటీవల మోడీ వివరించారు.
కార్పొరేట్ సంస్థలు వర్క్ ఫ్రమ్ హోంకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. దీనిని అమలు చేసే దిశగా ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ అడుగులు వేస్తోంది. కస్టమర్లతో నేరుగా సంబంధం లేని వ్యాపార, కార్పొరేట్ బ్యాంకింగ్ సేవలకు సంబంధించిన ఉద్యోగులకు వారంలో రెండు రోజులపాటు వర్క్ ఫ్రం హోం ప్రకటించింది. ఇది తక్షణమే అమలులోకి వస్తుందని తెలిపింది.
HDFC Bank | ఏయే విభాగాలకు వర్తిస్తుందంటే?
ట్రెజరీ ఆపరేషన్స్, ఫైనాన్స్ అకౌంట్స్, డిజిటల్ బ్యాంకింగ్ అండ్ టెక్నాలజీ, హెచఆర్ డిపార్ట్మెంట్, సాధారణ పరిపాలన సిబ్బందికి ఈ విధానం వర్తిస్తుంది. వినియోగదారులతో లేదా కస్టమర్లతో నేరుగా సంబంధం లేని, కంప్యూటర్ ఆధారిత పనులు చేసే ఉద్యోగులు మాత్రమే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. కస్టమర్లతో నేరుగా సంబంధం ఉండే ఉద్యోగుల విధులు యథావిధిగా కొనసాగనున్నాయి. వర్క్ ఫ్రం హోం వల్ల వినియోగదారులకు బ్యాంకు సేవల్లో ఎలాంటి అంతరాయం ఉండదని బ్యాంకు పేర్కొంది.
HDFC Bank | 30 రోజులు ప్రయోగాత్మకంగా..
వర్క్ ఫ్రమ్ హోంను నెల రోజుల పాటు ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. ఈ ముప్పై రోజుల్లో ఉద్యోగుల ఉత్పాదకత, బ్యాంక్ పనితీరు, సేవల నాణ్యతను ఉన్నతాధికారులు నిశితంగా సమీక్షిస్తారు. ఈ ప్రయోగం ఆశించిన ఫలితాలను ఇస్తే భవిష్యత్తులోనూ కొనసాగించే అవకాశాలున్నాయి.
ఇది కూడా చదవండి..: Rahul Gandhi Remarks| మోదీ ఒక దేశద్రోహి.. దేశాన్ని అమెరికాకు అమ్మేస్తున్నారు: రాహుల్ గాంధీ


