Hyderabad Youth Dies | అమెరికాలో హైదరాబాద్ యువకుడి మృతి

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Hyderabad Youth Dies | అమెరికా (America)లో హైదరాబాద్ నగరానికి చెందిన యువకుడు మృతి చెందాడు. నీటిలో మునిగిపోతున్న ముగ్గురు స్నేహితులను కాపాడి, చేపల వలలో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయాడు.

Hyderabad Youth Dies

నగరానికి చెందిన అనురూప్​ రెడ్డి ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. టెక్సాస్‌ (Texas)లోని డెంటన్‌ నగరంలో ఉంటూ యూనివర్శిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్​లో చదివాడు. ఇటీవల ఆయన గ్రాడ్యుయేషన్ పూర్తయింది. ఈ క్రమంలో స్నేహితులతో కలిసి టోలెడో బెండ్ డ్యామ్ సమీపంలోని స్పిల్‌వే వద్ద ఈతకు వెళ్లాడు. ఈత కొడుతుండగా తన స్నేహితులు నీట మునిగిపోతుండటంతో వారిని అనురూప్​ కాపాడాడు.

Hyderabad Youth Dies | ముగ్గురిని కాపాడి..

Hyderabad Youth Dies

ముగ్గురి స్నేహితులను అనురూప్​ కాపాడడు. అయితే తన ప్రాణాలను మాత్రం కోల్పోయాడు. తన మిత్రులను కాపాడిన తర్వాత అతడి కాళ్లకు చేపట వల చుట్టుకుంది. దీంతో బయటకు రాలేక నీట మునిగిపోయాడు. ఊపిరాడక మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బయటకు తీశారు.

ఇది కూడా చదవండి..: Kharge Hyderabad Visit | ఖర్గేకు ఘన స్వాగతం పలికిన సీఎం, పీసీసీ చీఫ్​

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *