అక్షరటుడే, వెబ్డెస్క్: Hyderabad Youth Dies | అమెరికా (America)లో హైదరాబాద్ నగరానికి చెందిన యువకుడు మృతి చెందాడు. నీటిలో మునిగిపోతున్న ముగ్గురు స్నేహితులను కాపాడి, చేపల వలలో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయాడు.
నగరానికి చెందిన అనురూప్ రెడ్డి ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. టెక్సాస్ (Texas)లోని డెంటన్ నగరంలో ఉంటూ యూనివర్శిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్లో చదివాడు. ఇటీవల ఆయన గ్రాడ్యుయేషన్ పూర్తయింది. ఈ క్రమంలో స్నేహితులతో కలిసి టోలెడో బెండ్ డ్యామ్ సమీపంలోని స్పిల్వే వద్ద ఈతకు వెళ్లాడు. ఈత కొడుతుండగా తన స్నేహితులు నీట మునిగిపోతుండటంతో వారిని అనురూప్ కాపాడాడు.
Hyderabad Youth Dies | ముగ్గురిని కాపాడి..
ముగ్గురి స్నేహితులను అనురూప్ కాపాడడు. అయితే తన ప్రాణాలను మాత్రం కోల్పోయాడు. తన మిత్రులను కాపాడిన తర్వాత అతడి కాళ్లకు చేపట వల చుట్టుకుంది. దీంతో బయటకు రాలేక నీట మునిగిపోయాడు. ఊపిరాడక మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బయటకు తీశారు.
ఇది కూడా చదవండి..: Kharge Hyderabad Visit | ఖర్గేకు ఘన స్వాగతం పలికిన సీఎం, పీసీసీ చీఫ్


