అక్షరటుడే, వెబ్డెస్క్: Yoga Day | అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆదివారం దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల నుంచి అధికారులు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు యోగా డేలో పాల్గొన్నారు.
ప్రధాని మోదీ (PM Modi), ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం యోగా ఆసనాలు వేశారు. పశ్చిమ బెంగాల్లోని అలీపుర్దువార్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా, జల్దాపారా జాతీయ పార్కులో మావటీలు ‘కుంకీ’ ఏనుగుల వీపులపై కూర్చుని యోగాసనాలు వేశారు.
Yoga Day | నదీ తీరంలో

హలోంగ్ నదీ తీరంలో అటవీ శాఖ సిబ్బంది, అధికారులు ఆరు కుంకీ ఏనుగులతో కలిసి యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలు, ఏనుగులు కలిసి యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్న ఈ దృశ్యాన్ని జల్దాపారా జాతీయ పార్కు అధికారులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పచ్చని ప్రకృతి అందాల నడుమ, నది తీరాన ఏనుగులతో కలిసి యోగా చేస్తున్న వీడియో వైరల్ అవుతోంది.
#WATCH | పశ్చిమ బెంగాల్లోని #Jaldapara National Parkలో యోగా దినోత్సవ వేడుకలు.#internationalyogaday #yogaday #westbengal pic.twitter.com/53xV7M2zf0
— Akshara Today | Telugu News (@aksharatoday) June 21, 2026
ఇది కూడా చదవండి..: Indigenous Warships Commissioned | అభివృద్ధి, భద్రత సముద్రంతో ముడిపడి ఉన్నాయి : ప్రధాని మోదీ