Sanjay Raut | శివసేన (యూబీటీ) చీలికపై ఎంపీ సంజయ్​ రౌత్​ సంచలన వ్యాఖ్యలు

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Sanjay Raut | ‘ఆపరేషన్ టైగర్’ గురించి శివసేన (UBT) ఎంపీ సంజయ్ రౌత్ (MP Sanjay Raut) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీలోని ఆరుగురు ఎంపీలు షిండే శివసేనలో చేరిన విషయం తెలిసిందే. దీంతో ఆపరేషన్​ టైగర్​ విజయవంతం అయిందని ఏక్​నాథ్​ షిండే (Eknath Shinde) ఇటీవల తెలిపారు.

సంజయ్​ రౌత్​ గురువారం మాట్లాడుతూ.. తాను ఎప్పుడూ తప్పుడు గణాంకాలను చెప్పలేదన్నారు. పార్టీ మారిన వారికి రాత్రిపూట రూ. 15 కోట్లు ఇచ్చారని, ఆ తర్వాత వారందరినీ జైపూర్‌కు తరలించి, మళ్లీ రూ. 10 కోట్లు ఇచ్చారన్నారు. ఎంపీలకు ఇంకా ఎక్కువ ఇచ్చారని పేర్కొన్నారు. నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకు కూడా ఆమోదం లభించాల్సి ఉంది, అందుకే ఆ ధర పెరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ డబ్బు కోసం తమను తాము వేలం వేసుకున్నారని చెప్పారు.

Sanjay Raut | 12 ఏళ్లుగా ఎమర్జెన్సీ

మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఏ పార్టీనీ విచ్ఛిన్నం చేయలేదని పేర్కొంటూ సంజయ్ రౌత్ అన్నారు. తొమ్మిది మంది యూబీటీ సేన లోక్‌సభ ఎంపీలలో ఆరుగురు శివసేనలోకి ఫిరాయించిన నేపథ్యంలో ‘పార్టీని చీల్చడం’ అనే విమర్శ వచ్చింది. ముంబైలో విలేకరుల సమావేశంలో రౌత్ మాట్లాడుతూ, గత 12 ఏళ్లుగా దేశం ఎమర్జెన్సీలో ఉందని పేర్కొన్నారు. 1975 నాటి ఎమర్జెన్సీని సమర్థిస్తూ, రాజ్యాంగంలో దానికి నిబంధన ఉందని ఆయన అన్నారు. ఇందిరా గాంధీ ఏ రాజకీయ పార్టీని చీల్చలేదు, రాజ్యాంగాన్ని రద్దు చేయలేదని పేర్కొన్నారు.

Sanjay Raut | అరాచకం ప్రబలితే..

Sanjay Raut

దేశంలో అరాచకం ప్రబలితే ఎమర్జెన్సీ విధించడానికి రాజ్యాంగంలో నిబంధన ఉందని ఆయన తెలిపారు. ఇందిరా గాంధీ విధించిన అత్యవసర పరిస్థితిని సమర్థించారు. పెద్ద నోట్ల రద్దు ఎందుకు అమలు చేశారని ప్రధాని మోదీని ఆయన ప్రశ్నించారు. బాలాసాహెబ్ థాకరే ఎమర్జెన్సీకి మద్దతు ఇచ్చారని గుర్తు చేశారు. కాగా 9వ తరగతి పాఠ్య పుస్తకంలో ఎన్​సీఈఆర్టీ ఇటీవల ఎమర్జెన్సీపై పాఠ్యంశాన్ని చేరింది. ఈ క్రమంలో సంజయ్​ వ్యాఖ్యలు చేశారు.

ఇది కూడా చదవండి..: Digital Arrest Scam | డిజిటల్ అరెస్ట్ స్కామ్స్.. 16 రాష్ట్రాల్లో సీబీఐ మెరుపు దాడులు

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *