Pregnant Suicide | కడుపులో బిడ్డకు డీఎన్​ఏ పరీక్ష చేయాలన్న భర్త.. వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్య

భర్త, అత్త వేధింపులు తాళలేక గర్భిణీ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మెదక్​ జిల్లా అల్లాదుర్గం మండలంలో చోటు చేసుకుంది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Pregnant Suicide | మెదక్​ జిల్లా (Medak District)లో అమానుష ఘటన చోటు చేసుకుంది. భార్యపై అనుమానంతో కడుపులో ఉన్న బిడ్డకు డీఎన్​ఏ పరీక్ష చేయాలని ఓ భర్త వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో ఐదు నెలల గర్భిణీ ఆత్మహత్య చేసుకుంది.

వికారాబాద్‌ జిల్లా (Vikarabad District) కోటపల్లి మండలం మోత్కుపల్లికి చెందిన సుస్మిత (23)కు ఏడాదిన్నర క్రితం మెదక్​ జిల్లా అల్లాదుర్గం మండలం గడిపెద్దాపూర్‌కి చెందిన గాజుల అభిలాష్​తో వివాహం జరిగింది. సుష్మిత ఇప్పుడు 5 నెలల గర్భిణీ. అయితే ఆమె గర్భానికి తాను కారణం కాదని అభిలాష్​ అనుమానం పెంచుకున్నాడు. భార్యపై అనుమానంతో పుట్టబోయే బిడ్డకు డీఎన్​ఏ పరీక్ష చేయాలని నిత్యం వేధించేవాడు. దీంతో ఇంట్లో గొడవలు జరిగేవి.

Pregnant Suicide | ఎవరు లేని సమయంలో..

భర్తతో పాటు అత్త సైతం సుష్మితను వేధించేది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న అల్లాదుర్గం పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. తన కూతురు మృతికి భర్త, అత్తలే కారణమని సుష్మిత తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Medak Tree Removal Dispute | విద్యుత్​ వర్సెస్​ ఫారెస్ట్ అధికారులు.. చెట్ల తొలగింపు అడ్డుకోవడంతో ఉద్రిక్తత

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *