అక్షరటుడే, వెబ్డెస్క్ : Kharif Season | వానాకాలం పంట సీజన్పై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు (Thummala Nageswara Rao) అధ్యక్షతన, రైతు కమిషన్ ఛైర్మన్ కోదండ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. వ్యవసాయ రంగానికి సంబంధించిన పలు ముఖ్య అంశాలపై చర్చించారు.
వానాకాలం సీజన్ కోసం వరి (Paddy) విత్తనాల అవసరం, సరఫరా, అలాగే పంటల మార్పిడి (Crop Diversification)పై చర్చించారు. సుమారు 10.80 లక్షల ఎకరాలకు అవసరం అయ్యేలా వరి విత్తనాల ప్రణాళికను రూపొందించారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించబడే రైతు వారోత్సవం కార్యక్రమాలపై చర్చించారు. ఈ కార్యక్రమం మే 4 నుంచి 9 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్నారు.
Kharif Season | రైతులకు అవగాహన
వారోత్సవాల్లో భాగంగా నేల ఆరోగ్యం, సమతుల్య ఎరువుల వినియోగం, సహజ వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించనున్నారు. ఉద్యాన పంటలు, ఆయిల్ పామ్ విస్తరణ, ప్రత్యామ్నాయ పంటల సాగు ప్రోత్సాహం కోసం కృషి చేస్తారు. పంట రుణాలు, సహకార సంఘాలు, మార్కెటింగ్ అవకాశాలు, సౌరశక్తి, యాంత్రీకరణ, డ్రోన్లు తదితర అంశాలపై రైతులకు వివరించారు. ఈ సమావేశంలో రాములు నాయక్, భవాని మరికంటి, సునీల్, గడుగు గంగాధర్, రాంరెడ్డి గోపాల్ పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి : Narsampet Tension | నర్సంపేట డిపో వద్ద తీవ్ర ఉద్రిక్తత.. రంగంలోకి బండి సంజయ్

