అక్షరటుడే, వెబ్డెస్క్: IPS Transfers | తెలంగాణ రాష్ట్రంలో పలువురు సీనియర్ ఐపీఎస్లు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీ కె.రామకృష్ణ రావు ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం ఏడుగురు ఐపీఎస్లకు స్థాన చలనం కల్పించారు.
IPS Transfers | ఏడుగురికి బదిలీ..
విజిలెన్స్ డీజీగా ఉన్న శిఖ గోయల్ను హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీగా బదిలీ చేశారు. పోలీస్ పర్సనల్ అడిషనల్ డీజీగా ఉన్న దేవేంద్ర సింగ్ చౌహాన్ను విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా నియమించారు. డ్రగ్స్ కంట్రోల్ డీజీగా ఉన్న షాన్వాజ్ కాసీంను మల్టీజోన్–2 ఐజీగా బదిలీ చేశారు. ఏసీబీ డైరెక్టర్గా ఉన్న తరుణ్ జోషిని ఫ్యూచర్ సిటీ కమిషనర్గా నియమించారు. అయితే ఇక్కడ పనిచేస్తున్న సుధీర్బాబు ఈ నెలాఖరున రిటైర్ కానున్నారు. ఇక మేడ్చల్ మల్కాజ్గిరి సీపీగా ఉన్న అవినాష్ మహంతిని డ్రగ్స్ కంట్రోల్ డైరెక్టర్, ఏసీబీ డైరెక్టర్గా కూడా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఎస్ఐబీ ఐజీపీగా ఉన్న బి.సుమతిని మేడ్చల్ మల్కాజ్గిరి సీపీగా బదిలీ చేశారు. ఇంటలిజెన్స్ ఐజీగా ఉన్న కార్తికేయకు ఎస్ఐబీ ఐజీపీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. కాగా.. త్వరలో మరికొంత మంది ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి..: IAS IPS transfers | త్వరలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్ల బదిలీలు

