అక్షరటుడే, వెబ్డెస్క్ : England vs India ODI | లార్డ్స్ వేదికగా జరుగుతున్న ఆఖరు మ్యాచ్లో ఇంగ్లాండ్ బ్యాటర్లు రెచ్చిపోయారు. భారత బౌలర్లపై విరుచుకుపడ్డారు. దీంతో ఇంగ్లిష్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 387 పరుగులు చేసింది.
ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా భారత్ టీ 20 సిరీస్ను కోల్పోయింది. అనంతరం తొలి వన్డేలో ఘన విజయం సాధించిన భారత జట్టు, రెండో వన్డేలో ఓడిపోయింది. దీంతో సీరిస్లో రెండు జట్లు 1–1తో సమంగా ఉన్నాయి. సిరీస్ గెలవాలంటే కీలకమైన మూడో మ్యాచ్లో ఇంగ్లిష్ బ్యాటర్లు రెచ్చిపోయారు. ఓపెనర్ బెన్ డకెట్ (Ben Ducket) సెంచరీతో చెలరేగాడు. 135 బంతుల్లో 141 పరుగులు చేశాడు. జాకోబ్ బెతెల్ (91) తృటిలో సెంచరి కోల్పోయాడు.
England vs India ODI | మెరుపు ఇన్నింగ్స్
ఓపెనర్లు ఔట్ అయిన తర్వాత జో రూట్ (Joe Root), బట్లర్ మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. టీ 20 తరహా బ్యాటింగ్తో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. హ్యారీ బ్రూక్ 14 పరుగులకే అవుట్ అయినా.. రూట్ 48 బంతుల్లో 74 పరుగులు చేశాడు. బట్లర్ 13 బంతుల్లో 41 పరుగులతో రాణించాడు. ఇందులో 4 ఫోర్లు, 3 సిక్స్లు ఉన్నాయి. బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగడంతో లార్డ్స్లో ఇంగ్లాండ్ మూడు వికెట్లు కోల్పోయి 387 పరుగులు చేసింది. వన్డే చరిత్రలో లార్డ్స్ స్టేడియంలో ఇదే అత్యధిక స్కోర్ కావడం గమనార్హం. భారత బౌలర్లలో ప్రసిద్ కృష్ణ రెండు వికెట్లు తీయగా.. గుర్నూర్ బ్రార్ పది ఓవర్లో 97 పరుగులు ఇచ్చాడు.
🏏 𝟑𝐫𝐝 𝐎𝐃𝐈 𝐈𝐧𝐝𝐢𝐚 𝐯𝐬 𝐄𝐧𝐠𝐥𝐚𝐧𝐝 🏏
ENGLAND 🏴 2️⃣6️⃣1️⃣-1️⃣ (40 ov) vs INDIA 🇮🇳 | CRR : 6.52
Current Batsmen :
Ben Duckett* : 127 (125)
Joe Root* : 23 (22)Jocob Bethell : 91 (93)
Prasidh Krishna : 1-36 (8)#ENGvIND #INDvsENG #ODI pic.twitter.com/GKWVf1CEGk
— Cricket Lover 🏏 (@Crick97924Lover) July 19, 2026
దీనిని కూడా చదవండి : Harish Rao | రైతుల పట్ల రేవంత్ సర్కారు రాక్షస పాలన: హరీశ్ రావు