Excise Vanamahotsavam | భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణం అందించాలి

భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణం అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎక్సైజ్ సూపరింటెండెంట్ ముకుంద రెడ్డి అన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Excise Vanamahotsavam | భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణం అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎక్సైజ్ సూపరింటెండెంట్ ముకుంద రెడ్డి (Excise Department,) అన్నారు. వనమహోత్సవంలో (Vanamahotsavam) భాగంగా మంగళవారం కామారెడ్డి (kamareddy) మండలం చిన్నమల్లారెడ్డి గ్రామంలో ఎక్సైజ్​ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ఈత మొక్కలు నాటారు.

Excise Vanamahotsavam | పర్యాపరణ పరిరక్షణ కోసం..

ఆయన మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడం కోసం ప్రభుత్వం చేపడుతున్న వనమహోత్సవ కార్యక్రమాన్ని ప్రజలంతా విజయవంతం చేయాలని కోరారు. నాటిన ప్రతిమొక్కను సంరక్షించడం ద్వారానే పర్యావరణానికి మేలు జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో ఈత చెట్ల పెంపకం గౌడ కుల వృత్తిదారుల జీవనోపాధికి ఎంతో ఉపయోగకరమని, ఈతమొక్కల పెంపకాన్ని ప్రోత్సహించడం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు గ్రామీణ ఆర్థికాభివృద్ధికి కూడా తోడ్పాటు అందుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ భీమయ్యల లక్ష్మీరాజు, ఉప సర్పంచ్ లక్ష్మీ నారాయణ, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ అరుణ్ చంద్ర, సీఐ సంపత్ కృష్ణ, ఎస్సైలు విక్రమ్ కుమార్, శ్రీనివాసరావు, ఏపీవో అన్నపూర్ణ, హెడ్ కానిస్టేబుళ్లు జాన్, ఫరీద్, కానిస్టేబుళ్లు ఘోరీ, రాజు, దినేష్, శరత్, పవన్, బాబు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: పార్లమెంట్ ఆవరణలో నిరసన తెలుపుతున్న ASP MP చంద్రశేఖర్ ఆజాద్‌ను కలిసిన MIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ  

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *