అక్షరటుడే, వెబ్డెస్క్: Saudi Houthi Attacks : మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రమవుతున్నాయి. యెమెన్లోని హౌతీల ఆధీనంలోని హొడైదా నగరంపై సౌదీ అరేబియా వైమానిక దాడులు నిర్వహించింది. అమెరికా–ఇరాన్ ప్రాంతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ దాడులు చోటుచేసుకోవడం పరిస్థితిని మరింత సంక్లిష్టం చేసింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ, వాషింగ్టన్–టెహ్రాన్ మధ్య చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఇరాన్పై గతంలో హెచ్చరించిన “భారీ దాడి” అవసరం లేకపోవచ్చని పేర్కొన్నప్పటికీ, అమెరికా సైన్యం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా సిద్ధంగా ఉందని చెప్పారు.
Syria Bus Collision | సిరియాలో రెండు బస్సులు ఢీ.. 35 మంది దుర్మరణం
Saudi Houthi Attacks | తగ్గేదే లేదంటున్న ఇరాన్
మరోవైపు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ స్పందిస్తూ, బెదిరింపులకు తమ దేశం భయపడదని, ఒత్తిడికి తలొగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా, ఆక్రమిత వెస్ట్ బ్యాంక్లో ఇజ్రాయెల్ సైన్యం “ఉగ్రవాద వ్యతిరేక చర్యలు” చేపట్టింది. నాబ్లస్ నగరానికి నైరుతి దిశలో శుక్రవారం జరిగిన హింసాత్మక ఘటనల్లో నలుగురు పాలస్తీనీయులు, ఇద్దరు ఇజ్రాయెల్ సైనికులు సహా మొత్తం ఆరుగురు మృతి చెందిన నేపథ్యంలో అక్కడ కర్ఫ్యూ విధించినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది.
మధ్యప్రాచ్యంలోని తాజా పరిణామాలు ప్రాంతీయ భద్రతపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని అంతర్జాతీయ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.