అక్షరటుడే, ఇందూరు: TNGOs Bonalu | టీఎన్జీవోస్ నిజామాబాద్ (Nizamabad) ఆధ్వర్యంలో ఈనెల 5న బోనాల పండుగను నిర్వహించనున్నట్లు ఎంప్లాయీస్ జేఏసీ జిల్లా ఛైర్మన్, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు నాశెట్టి సుమాన్ కుమార్ తెలిపారు. ఈ మేరకు ఆయన టీఎన్జీవోస్ భవన్లో మాట్లాడారు.
TNGOs Bonalu | పాత కలెక్టరేట్ మైదానం నుంచి..
నాశెట్టి సుమన్కుమార్ మాట్లాడుతూ.. 5వ తేదీన ఉదయం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సభాస్థలి నుండి బోనాలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తామన్నారు. అనంతరం అక్కడి నుండి బోనాలను ఊరేగింపుగా తీసుకొచ్చి, పాత కలెక్టరేట్ ఆలయ ఆవరణలో నవదుర్గామాతకు భక్తిశ్రద్ధలతో సమర్పిస్తామని వివరించారు. అనంతరం మహా అన్నదానం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్రెడ్డి, షబ్బీర్అలీ, ఎమ్మెల్యేలు ధన్పాల్, భూపతిరెడ్డి, మేయర్ ఉమారాణి, కలెక్టర్, సీపీ, మాజీ మేయర్లకు ఆహ్వాపత్రాలు అందజేశామని వివరించారు.
ఇది కూడా చదవండి..: Kamareddy Flood Rescue | వరద నీటిలో నిలిచిపోయిన పెళ్లి బస్సు.. రక్షించిన పోలీసులు