అక్షరటుడే, వెబ్డెస్క్: Imran Khan Death Rumours | పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మృతి చెందినట్లు ఆ దేశానికి చెందిన జర్నలిస్ట్ సయీద్ ఖాన్ చేసిన సోషల్ మీడియా (Social Media) పోస్ట్ తీవ్ర కలకలం రేపింది. ఇమ్రాన్ ఖాన్ జైల్లోనే ప్రాణాలు కోల్పోయారని తనకు ముగ్గురు సీనియర్ సైనికాధికారులు చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ వార్తతో పాక్ ప్రజలు, ఆయన పార్టీ కార్యకర్తలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మరోవైపు, ఇమ్రాన్ను కలిసేందుకు కుటుంబసభ్యులకు అధికారులు అనుమతి నిరాకరించడంతో అనుమానాలు మరింత బలపడ్డాయి.
Imran Khan Death Rumours | ప్రభుత్వానికి పీటీఐ హెచ్చరిక..
తమ నేత ఇమ్రాన్ఖాన్కు ఏమైనా జరిగితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చేందుకు 20 లక్షల మంది సిద్ధంగా ఉన్నారని ఖైబర్ పఖ్తుంఖ్వా ముఖ్యమంత్రి, పీటీఐ నేత సోహైల్ అఫ్రిది హెచ్చరించారు. ఆ సమయంలో యువత ఆగ్రహాన్ని అణచివేయడానికి దేశ సైన్యం కూడా సరిపోదని ఆయన స్పష్టం చేశారు. ఇమ్రాన్ను కలవడానికి కుటుంబసభ్యులకు, వైద్యులకు అనుమతి ఇవ్వకపోతే పెద్దఎత్తున నిరసనలు చేపడతామని పీటీఐ తేల్చిచెప్పింది. ఇందులో భాగంగానే సెప్టెంబర్ 27న ఇస్లామాబాద్ వైపు భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. కాగా, ఈ ప్రచారాలపై పాకిస్థాన్ ప్రభుత్వం కానీ, జైలు అధికారులు కానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
ఇమ్రాన్ ఖాన్ మృతి చెందారా? పాకిస్థాన్లో తీవ్ర ఉద్రిక్తత..
రావల్పిండిలోని అడియాల జైలులో ఉన్న #Pakistan మాజీ ప్రధాని, పీటీఐ (PTI) అధినేత #ImranKhan మృతి చెందారంటూ అమెరికాలోని పాక్ జర్నలిస్ట్ వజాహత్ సయీద్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు పాకిస్థాన్లో తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి.
కుటుంబ… pic.twitter.com/1Ta3jtVzqY
— Tone News (@ToneNewsLive) August 12, 2026
ఇది కూడా చదవండి: Trump Iran Talks | ఇరాన్తో చర్చలపై నమ్మకం లేదు.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు