Kerala Excise bribery | కేరళంలో ‘ఎక్సైజ్’ లంచాల దందా.. ఏడుగురు అధికారుల సస్పెన్షన్

కేరళంలో బార్ల నుంచి లంచాలు తీసుకుంటున్న ఏడుగురు ఎక్సైజ్​ అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kerala Excise bribery | కేరళంలో లైసెన్స్ పొందిన బార్ల నుంచి డబ్బు, మద్యం మరియు ఇతర ఉచితాలను వసూలు చేయడంలో జరుగుతున్న లంచాల దందాను ఒక స్టింగ్​ ఆపరేషన్​ బయటపెట్టింది. ఈ ఘటన తర్వాత ప్రభుత్వం కొట్టాయం డిప్యూటీ ఎక్సైజ్ కమిషనర్ ఎస్. అశోక కుమార్‌తో సహా ఏడుగురు కేరళ ఎక్సైజ్ అధికారులను సస్పెండ్ చేసింది. ఎక్సైజ్ మంత్రి ఎం. లిజు ఆదేశాల మేరకు ఎక్సైజ్ కమిషనర్ సీరం సాంబశివరావు ఈ సస్పెన్షన్లకు ఆదేశించారు.

కొట్టాయం (Kottayam) జిల్లాలోని చంగనస్సేరి ప్రాంతంలో బార్ల నుంచి డబ్బు, మద్యం వసూలు చేస్తున్నారని వాట్సాప్ ద్వారా శాఖకు రహస్య ఫిర్యాదులు అందాయి. దీంతో అధికారులు ‘ఆపరేషన్ బీజాపూర్’ (Operation Bijapur) పేరిట తనిఖీలు చేశారు. ఫిర్యాదులను ధృవీకరించడానికి, ఎక్సైజ్ కమిషనర్ సాంబశివరావు మారువేషంలో వెళ్లారు. ఆగస్టు 28న రాత్రి న్యూయార్క్ స్క్వేర్ బార్, పంచవాడి బార్‌తో సహా పలు బార్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సిబ్బంది లంచాలు తీసుకుంటున్నట్లు గుర్తించారు. బార్ల నుండి నిర్ణీత మొత్తంలో డబ్బు, ప్రీమియం మద్యం సీసాలు, ఆహారాన్ని క్రమం తప్పకుండా సేకరించేవారు.

Kerala Excise bribery | బెదిరింపులకు పాల్పడి..

బార్ యజమానులను వేధింపులకు గురిచేస్తామని బెదిరించి, వారి నుండి డబ్బు వసూలు చేయడానికి డిప్యూటీ ఎక్సైజ్ కమిషనర్ ఎస్. అశోక కుమార్, కరింకాడ జోస్యి అనే స్థానిక మధ్యవర్తిని ఉపయోగించుకున్నట్లు గుర్తించారు. ఆపరేషన్ సమయంలో సేకరించిన బార్ రిజిస్టర్లు, మెసేజ్‌లు, వాంగ్మూలాలను ఉపయోగించి, దర్యాప్తు అధికారులు కనీసం రూ. 55,000 విలువైన చెల్లింపులను గుర్తించారు. అయితే విచారణ కోసం డిప్యూటీ ఎక్సైజ్ కమిషనర్ ఎస్. అశోక కుమార్‌ ఫోన్​ తీసుకోగా.. ఆయన అందులోని డేటా డిలీట్ చేశాడు.

Kerala Excise bribery | ఏడుగురిపై వేటు

విచారణ అనంతరం అధికారులు ఏడుగురు ఎక్సైజ్​ అధికారులపై వేటు వేశారు. వారిలో ఎస్. అశోక కుమార్, డిప్యూటీ ఎక్సైజ్ కమిషనర్, కొట్టాయం, ఎం. మాన్యువల్, ప్రివెంటివ్ ఆఫీసర్, స్పెషల్ స్క్వాడ్; ప్రవీణ్ శివానంద్, ప్రివెంటివ్ ఆఫీసర్, స్పెషల్ స్క్వాడ్; లాలూ తంకచన్, ప్రివెంటివ్ ఆఫీసర్ గ్రేడ్, చంగనస్సేరి; సంతోష్ టి, ప్రివెంటివ్ ఆఫీసర్ గ్రేడ్, చంగనస్సేరి; శిజు కె, ప్రివెంటివ్ ఆఫీసర్ గ్రేడ్, చంగనస్సేరి; విశాఖ్ ఏఎస్, సివిల్ ఎక్సైజ్ ఆఫీసర్, చంగనస్సేరి ఉన్నారు.

దీనిని కూడా చదవండి : Boat accident | నార్త్‌ సైప్రస్‌ తీరంలో బోటు బోల్తా.. ఆరుగురు మృతి

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *