అక్షరటుడే, వెబ్డెస్క్ : Boat accident | టర్కీ (Turkey) ఆధీనంలో ఉన్న ఉత్తర సైప్రస్ (Cyprus) తీరంలో ఓ బోటు బోల్తా పడింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. పలువురిని అధికారులు రక్షించారు.
దాదాపు 270 మంది ప్రయాణికులు, సిబ్బందితో ప్రయాణిస్తున్న ఫెర్రీ బోల్తా పడటంతో కనీసం ఆరుగురు మరణించినట్లు స్థానిక మీడియా తెలిపింది. 172 మందికి పైగా ప్రజలను రక్షించినట్లు ఆ ప్రాంత ప్రధానమంత్రి ఉనాల్ ఉస్టెల్ తెలిపారు. ఈ ఫెర్రీ ఫిలో డెనిజ్సిలిక్ కంపెనీకి చెందింది. డయానా బీచ్ వద్ద మునిగిపోయిందని కైరేనియా మేయర్ మురత్ షెంకుల్ తెలిపారు. తీరానికి సుమారు 7.5 కిలోమీటర్ల దూరంలో ఫెర్రీ లోపలికి నీరు లోపలికి రావడం ప్రారంభమైందని సమాచారం. దీంతో ప్రయాణికులు నీటిలో దూకారు.
Boat accident | 89 మంది గల్లంతు
ఫెర్రీ బోల్తా పడిందనే సమాచారం మేరకు సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. 172 మందిని కాపాడాయి. గాయపడ్డ పలువురిని ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో 89 మంది గల్లంతయ్యారని పేర్కొన్నారు. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనకు గల కారణాలపై దర్యాప్తు జరుపుతామని అధికారులు తెలిపారు.
🚨 BREAKING: Passenger ferry sinking off the coast of Northern Cyprus
There are 279 people on board. Turkish media report that some passengers have been injured.
People are awaiting rescue on the overturned ferry, which was heading to the Turkish port of Taşucu 🇹🇷
Coast guard… pic.twitter.com/XwgpXiga9q
— NEXTA (@nexta_tv) August 30, 2026
దీనిని కూడా చదవండి : Mojtaba Khamenei | నిజమైన శత్రువును గుర్తించండి.. ముస్లిం దేశాలకు ఖమేనీ లేఖ