Delhi Airport Flood | ఢిల్లీ ఎయిర్​పోర్టును ముంచెత్తిన వరద

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Delhi Airport Flood | ఢిల్లీ అంతర్జాతీయ ఎయిర్​ పోర్టును శుక్రవారం వరద నీరు ముంచెత్తింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షం విమానాశ్రయ కార్యకలాపాలపై కూడా ప్రభావం చూపింది. ఢిల్లీకి రావాల్సిన ఐదు విమానాలను లక్నో విమానాశ్రయానికి మళ్లించారు.

ఢిల్లీలో శుక్రవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. దీంతో ఎయిర్​పోర్టులోకి వరద వచ్చింది. ప్రవేశ ద్వారాలకు చేరుకోవడానికి ప్రయాణికులు తమ ప్యాంట్‌లను పైకి మడుచుకుని, నీటిలో లగేజీ ట్రాలీలను నెట్టుకుంటూ వెళ్లారు. అక్కడ భారీగా నీరు చేరింది. నేను దాదాపు అరగంటగా ఇక్కడే నిలబడి ఉన్నాను, అరైవల్ గేట్ల వైపు వెళ్లడానికి నీటి మట్టం తగ్గుతుందేమోనని వేచి చూశానని ఓ ప్రయాణికుడు పేర్కొన్నారు.

Delhi Airport Flood | భారీ వర్షంతో..

భారత వాతావరణ శాఖ (IMD) గణాంకాల ప్రకారం, ఉదయం 11:30 నుండి మధ్యాహ్నం 2:30 గంటల మధ్య పాలమ్‌లో 3.4 మి.మీ వర్షపాతం నమోదైంది. తక్కువ ఎత్తులో ఉన్న ప్రాంతాలు మరియు అండర్‌పాస్‌లలో నీరు నిలిచిపోయే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ, IMD ఢిల్లీకి ‘ఎల్లో అలర్ట్’ జారీ చేసింది. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ అంతరాయాలు మరియు ప్రజా రవాణాలో జాప్యం జరిగే అవకాశం కూడా ఉంది.

దీనిని కూడా చదవండి : Inter Education | తుగ్లక్ కూడా సిగ్గు పడేలా సీఎం మాటలు : కవిత

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.