ఆంధ్రప్రదేశ్​Bapatla Train Robbery | బాపట్ల జిల్లాలో రైలు దోపిడీ కలకలం.. ప్రయాణికులను బెదిరించి బంగారం...

Bapatla Train Robbery | బాపట్ల జిల్లాలో రైలు దోపిడీ కలకలం.. ప్రయాణికులను బెదిరించి బంగారం లూటీ

బెంగళూరు–నరసాపురం స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైలులో అర్ధరాత్రి దుండగులు బీభత్సం సృష్టించి ప్రయాణికుల నుంచి సుమారు 11 తులాల బంగారం దోచుకెళ్లారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్: Bapatla Train Robbery | ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లో మరోసారి రైలు దోపిడీ ఘటన కలకలం రేపింది. బాపట్ల జిల్లా పరిధిలో శనివారం అర్ధరాత్రి జరిగిన ఈ సంఘటన ప్రయాణికుల్లో తీవ్ర భయాందోళనలకు దారితీసింది.

బెంగళూరు నుంచి నరసాపురం వెళ్తున్న స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైలు (07154)లో దుండగులు దాడి చేసి విలువైన బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. రైలు బాపట్ల–అప్పికట్ల మధ్య ప్రయాణిస్తున్న సమయంలో గుర్తు తెలియని దుండగులు బోగీల్లోకి చొరబడ్డారు. ముఖ్యంగా S7, S11, S12, S13 స్లీపర్ కోచ్‌లను లక్ష్యంగా చేసుకుని దాడి చేసినట్లు సమాచారం. నిద్రలో ఉన్న ప్రయాణికులను లేపి, కత్తులతో బెదిరించి వారి వద్ద ఉన్న బంగారు ఆభరణాలను లాక్కున్నారు.

Bapatla Train Robbery | ఎంత నష్టం?

ఈ దోపిడీలో సుమారు 11 తులాల బంగారం దుండగులు ఎత్తుకెళ్లినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. బాధితుల ప్రకారం, దుండగులు చాలా వేగంగా ఈ ఘటనను అమలు చేసి, కొద్ది నిమిషాల్లోనే బోగీల నుంచి బయటపడ్డారు. దోపిడీ అనంతరం దుండగులు అప్పికట్ల వద్ద రైలును ఆపించి దూకి పరారైనట్లు సమాచారం. ఈ సంఘటనతో రైలులో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా భయంతో వణికిపోయారు. బాధితులు వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసిన రైల్వే పోలీసు (Railway Police) అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. పాత నేరస్థుల వివరాలను కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

Bapatla Train Robbery | రైళ్లలో భద్రతపై మరోసారి ప్రశ్నలు

ఈ ఘటనతో రైళ్లలో భద్రతపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తబడ్డాయి. అర్ధరాత్రి సమయంలో సెక్యూరిటీ లోపాలు స్పష్టంగా బయటపడినట్లు ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైల్వే అధికారులు (Railway Officers) భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఈ ఘటనపై పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది. అయితే, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

ఇది కూడా చదవండి..: Pawan Kalyan Surgery | ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు అత్యవసర శస్త్రచికిత్స.. నిల‌క‌డ‌గా ఆరోగ్యం

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Harish Rao TRS row | TRS పేరుతో హరీష్ రావు సొంత పార్టీ!..ఇది కొత్త వ్యూహమా..?

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Harish Rao TRS row | తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర...

Sridip Success Story | తండ్రి మరణంతో కన్నీటి చుక్కలు రాసిన అక్షరాల విజయగాథ!

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Sridip Success Story | పరీక్ష హాలులో ప్రశ్నపత్రాన్ని...

SRH Powerplay Score | SRH ఊచకోత.. MI బౌలర్లపై విరుచుకుపడ్డ ఓపెనర్లు.. పవర్‌ప్లేలోనే మ్యాచ్ మలుపు!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: SRH Powerplay Score | ఐపీఎల్‌లో మరోసారి రన్‌ఫెస్ట్‌కు...

Pallikonda Theft Case | పల్లికొండలో దొంగల హల్​చల్​.. ఐదు తులాల బంగారం దోపిడీ..

అక్షరటుడే, భీమ్​గల్: Pallikonda Theft Case | దొంగలు హల్​చల్​ చేశారు....