అక్షరటుడే, వెబ్డెస్క్ : Modi on Gold Purchase | ఏడాది పాటు బంగారం కొనొద్దని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ప్రజలను కోరారు. హైదరాబాద్ (Hyderabad) నగరంలోని పరేడ్ గ్రౌండ్స్లో జరిగిన సభలో ఆయన మాట్లాడారు.
పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ఇంధన సంక్షోభం వచ్చిందని మోదీ అన్నారు. అయినా ఇంధనం రేట్లు పెంచడం లేదని తెలిపారు. అయితే ప్రజలు పెట్రోల్ (Petrol), డీజిల్ వినియోగాన్ని తగ్గించాలని కోరారు. మెట్రో సేవలను వాడుకోవాలని సూచించారు. ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించాలని పిలుపునిచ్చారు.
Modi on Gold Purchase | ఫంక్షన్లు ఉన్నా..
ఏడాది పాటు ఏ ఫంక్షన్లు ఉన్నా.. ప్రజలు బంగారం కొనొద్దని మోదీ కోరారు. ఈ మేరకు ప్రజలు శపథం చేయాలన్నారు. విదేశీ మారకద్రవ్యాన్ని (Foreign exchange) కాపాడుకోవాలని సూచించారు. ఎరువులు, రసాయనాల వినియోగాన్ని సైతం తగ్గించాలన్నారు. సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లాలని రైతులకు సూచించారు. ప్రజలు వంట నూనెల వినియోగాన్ని తగ్గించాలన్నారు. మధ్య తరగతి ప్రజలు దుబారా ఖర్చులను తగ్గించుకోవాలని ఆయన కోరారు. ఆడంబరాలకు పోవొద్దని హితవు పలికారు. ఆయన వ్యాఖ్యలు ఇప్పడు తీవ్ర చర్చకు దారి తీశాయి.
Modi on Gold Purchase | వర్క్ ఫ్రం హోమ్ చేయాలి
వ్యవసాయంలో డీజిల్కు బదులు సౌర పంపులను ప్రోత్సహిస్తున్నామని ప్రధాని వెల్లడించారు. వ్యవసాయంలో స్వదేశీ వస్తువులను ఎక్కువగా వినియోగించుకోవాలని రైతులను కోరారు. కనీసం ఏడాది పాటు విదేశీ పర్యటనలు తగ్గించుకోవాలన్నారు. కరోనా సమయంలో వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని సూచించినట్లు మోదీ గుర్తు చేశారు. ఇప్పుడు కూడా మళ్లీ అదే పద్ధతిని ప్రారంభించాలన్నారు. ఆన్లైన్ మీటింగ్స్, వర్క్ ఫ్రమ్ హోమ్కి ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. ఇటీవల ముడి చమురు రేట్లు భారీగా పెరిగాయి. దీంతో విదేశీ మారకద్రవ్యాన్ని ఇంధనం కోసం ఎక్కువగా వినియోగించాల్సి వస్తోంది. ఈ క్రమంలో ప్రధాని వ్యాఖ్యలు చేశారు.
Prioritise Work from Home – PM Modi
Don’t buy GOLD for one Year
Travel by Metro, send parcels by rail, avoid car to reduce usage of petrol and diesel
Reduce usage of cooking oil
Reduce usage of Chemical fertiliser by half and move towards Natural farming
Don’t use branded… pic.twitter.com/qnVCPhRFr8
— Naveena (@TheNaveena) May 10, 2026
దీనిని కూడా చదవండి : Modi Targets Congress | ఈ సారి తెలంగాణలో బీజేపీ ప్రభుత్వమే : ప్రధాని మోదీ

