అక్షరటుడే, వెబ్డెస్క్: AP FDC | ఎట్టకేలకు ఫిల్మ్ టీవీ థియేటర్ అభివృద్ధి సంస్థ (FDC) ఛైర్మన్, డైరెక్టర్లను నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఛైర్మన్గా ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ పి.భరత్ భూషణ్ ను ఖరారు చేసింది. వైస్ ఛైర్మన్గా దర్శకుడు మెహర్ రమేష్ను ఎంపిక చేసింది.
AP FDC | సముచిత స్థానం..
వీరికితోడు 14 మంది డైరెక్టర్లను నియమించింది. సినీ రచయిత writers, తెనాలి కళల కాణాచి పరిషత్ నిర్వాహకులు బుర్రా సాయి మాధవ్, చిలకలూరిపేటకు చెందిన రిటైర్డ్ అధ్యాపకులు, రచయిత డా. కందిమళ్ల సాంబశివరావులను డైరెక్టర్లుగా నియమించింది.
అలాగే ప్రముఖ నటులు Actors సుమన్ తల్వార్, శివాజీ, నిర్మాతలు Producers చదలవాడ శ్రీనివాసరావు, కూచిభోట్ల వివేకానంద, నటి ఝాన్సీ, సీనియర్ జర్నలిస్ట్ కె.ఉమా మహేశ్వరరావు, దర్శకుడు వి. సముద్ర, మీర్ ఎస్., ఎ.సత్యనారాయణ, దర్శకుడు ఎస్.వి.కృష్ణారెడ్డి, జి.రాజ్ వెంకటేశ్వర యాదవ్, డి. సత్యనారాయణను డైరెక్టర్లుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
AP FDC | ఈ వేడుకల పర్యవేక్షణ..
ఇకపై టీవీ, సినిమా నంది అవార్డులు Awards, నంది Nandi నాటకోత్సవాలు ఈ కమిటీ ఆధ్వర్యంలో జరగనున్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్లో సినిమా, టీవీ షూటింగులు జరిగేందుకు, సినీ, టీవీ, రంగస్థల కళాకారుల అభివృద్ధికి ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చిత్తశుద్ధితో కృషి చేయాలని ముఖ్యమంత్రి Nara చంద్రబాబు Naidu ఆదేశించారు.
Telugu States Summer | పల్నాడులో 48.1 డిగ్రీలు.. బయ్యారంలో 46.20…


