అక్షరటుడే, వెబ్డెస్క్ : Delhi Airport Flood | ఢిల్లీ అంతర్జాతీయ ఎయిర్ పోర్టును శుక్రవారం వరద నీరు ముంచెత్తింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షం విమానాశ్రయ కార్యకలాపాలపై కూడా ప్రభావం చూపింది. ఢిల్లీకి రావాల్సిన ఐదు విమానాలను లక్నో విమానాశ్రయానికి మళ్లించారు.
ఢిల్లీలో శుక్రవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. దీంతో ఎయిర్పోర్టులోకి వరద వచ్చింది. ప్రవేశ ద్వారాలకు చేరుకోవడానికి ప్రయాణికులు తమ ప్యాంట్లను పైకి మడుచుకుని, నీటిలో లగేజీ ట్రాలీలను నెట్టుకుంటూ వెళ్లారు. అక్కడ భారీగా నీరు చేరింది. నేను దాదాపు అరగంటగా ఇక్కడే నిలబడి ఉన్నాను, అరైవల్ గేట్ల వైపు వెళ్లడానికి నీటి మట్టం తగ్గుతుందేమోనని వేచి చూశానని ఓ ప్రయాణికుడు పేర్కొన్నారు.
Delhi Airport Flood | భారీ వర్షంతో..
భారత వాతావరణ శాఖ (IMD) గణాంకాల ప్రకారం, ఉదయం 11:30 నుండి మధ్యాహ్నం 2:30 గంటల మధ్య పాలమ్లో 3.4 మి.మీ వర్షపాతం నమోదైంది. తక్కువ ఎత్తులో ఉన్న ప్రాంతాలు మరియు అండర్పాస్లలో నీరు నిలిచిపోయే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ, IMD ఢిల్లీకి ‘ఎల్లో అలర్ట్’ జారీ చేసింది. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ అంతరాయాలు మరియు ప్రజా రవాణాలో జాప్యం జరిగే అవకాశం కూడా ఉంది.
Heavy rain has turned parts of Delhi’s Indira Gandhi International Airport into a surprise water park, with passengers seen wading through flooded areas to reach the terminal gates. @DelhiAirport pic.twitter.com/qEe1HkIuXA
— Ashoke Raj (@Ashoke_Raj) September 4, 2026
దీనిని కూడా చదవండి : Inter Education | తుగ్లక్ కూడా సిగ్గు పడేలా సీఎం మాటలు : కవిత