జాతీయంModi Online Classes | విద్యాసంస్థలు కొన్నాళ్లు ఆన్​లైన్​ క్లాసులు నిర్వహించాలి : ప్రధాని Modi...

Modi Online Classes | విద్యాసంస్థలు కొన్నాళ్లు ఆన్​లైన్​ క్లాసులు నిర్వహించాలి : ప్రధాని Modi పిలుపు

సాధ్యమైనంత వరకు కార్యాలయాలకు,  వెళ్లకుండా ఇంటి నుంచే విధులు నిర్వహించడం వల్ల ఇంధన ఆదా అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Modi Online Classes | అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులు, పెరుగుతున్న ఇంధన ధరల దృష్ట్యా దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడానికి పౌరులంతా క్రమశిక్షణతో వ్యవహరించాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు.

Modi Online Classes | ఇంధన వాడకం తగ్గించేందుకు..

గుజరాత్​ పర్యటనలో ఉన్న ఆయన అక్కడ జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించేందుకు పాఠశాలలు, కాలేజీలు, ఇతర ప్రభుత్వ – ప్రైవేటు విద్యా సంస్థలు మళ్లీ ఆన్​లైన్​ తరగతులు ప్రారంభించాలని మోడీ సూచించారు.

కొవిడ్​ కష్టకాలంలో మనం నేర్చుకున్న పాఠాలను ఇప్పుడు దేశ ప్రయోజనాల కోసం వాడుకోవాలని ప్రధాని మోడీ కోరారు. “కరోనా సమయంలో మనం ఆన్​లైన్​ తరగతులు, వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్‌లైన్ మీటింగ్స్, వీడియో కాన్ఫరెన్స్‌ల వంటి కొత్త వ్యవస్థలను అలవాటు చేసుకున్నాం.. ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల దృష్ట్యా ఆ పద్ధతులను మళ్లీ అమల్లోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది.. ఇది భారత దేశ హితం కోసం మనం చేసే పెద్ద పని అవుతుంది..” అని మోడీ పేర్కొన్నారు.

Modi Online Classes | కొనుగోళ్లను వాయిదా వేయాలని

విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసేందుకు ప్రజలు తమ వ్యక్తిగత ఖర్చుల విషయంలో నిగ్రహం పాటించాలని మోడీ కోరారు. పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించడం ద్వారా ఇంధన పొదుపు పాటించాలన్నారు. మెట్రో రైళ్లు, ప్రజా రవాణా వ్యవస్థను ఉపయోగించాలని కోరారు. అవసరమైతే కార్‌పూలింగ్ (వాహనాలను పంచుకోవడం) చేయాలని మోడీ సూచించారు.

బంగారం కొనుగోళ్లు: కనీసం ఏడాది పాటు బంగారం కొనుగోళ్లను వాయిదా వేయాలని మోడీ కోరారు. దీనివల్ల విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుందన్నారు.

విదేశీ ప్రయాణాలు: విదేశాల్లో వివాహాలు, విహారయాత్రల వంటి ఆడంబరాలకు పోవద్దని కోరారు. దేశీయ పర్యాటకాన్నే ప్రోత్సహించాలని సూచించారు.

ఆర్థిక క్రమశిక్షణ: వంట నూనెల వినియోగాన్ని 10 శాతం తగ్గించాలన్నారు. తద్వారా దిగుమతుల భారం తగ్గుతుందని మోడీ పేర్కొన్నారు.

Modi Online Classes | దేశభక్తి అంటే బాధ్యతగా జీవించడమే!

“దేశభక్తి అంటే సరిహద్దుల్లో ప్రాణాలు అర్పించడమే కాదు.. కష్టకాలంలో దేశ ఆర్థిక వ్యవస్థకు అండగా ఉంటూ మన బాధ్యతలను సక్రమంగా నెరవేర్చడం కూడా దేశభక్తే..” అని మోడీ వ్యాఖ్యానించారు.

అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగుతున్నప్పటికీ, ప్రభుత్వం ప్రజలపై భారం పడకుండా రాయితీలు ఇస్తోందని తెలిపారు. ప్రజలు కూడా ఇంధన పొదుపులో భాగస్వాములు కావాలని మోడీ విజ్ఞప్తి చేశారు.

Revanth Reddy Anti Drug Pledge | జూన్​ 12న విద్యార్థుల మహాసభ.. యాంటీ డ్రగ్‌ ప్రతిజ్ఞ చేయించాలని గవర్నర్​కు సీఎం ఆహ్వానం

Naresh Chandan
Naresh Chandanhttps://aksharatodaynews.com/
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Komiravelli Panchayat Bribery | డ్రైనేజీ పైపులైన్​ తొలగించేందుకు లంచం.. ఏసీబీ వలలో పంచాయతీ కార్యదర్శితోపాటు సర్పంచి భర్త!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Komiravelli Panchayat Bribery | రాష్ట్రంలో అవినీతి అధికారులు...

SP Rajesh Chandra | చోరీలకు పాల్పడుతున్న వ్యక్తుల ఆట కట్టించిన పోలీసులు

అక్షరటుడే, కామారెడ్డి: SP Rajesh Chandra | పట్టణంలో పలు చోరీలకు...

Kamareddy Vegetable Vendors | పట్టణంలో రాత్రివేళ రోడ్డు పక్కనే కూరగాయల విక్రయాలు..

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Vegetable Vendors | పట్టణంలో రోజువారీగా కూరగాయల...