Kamareddy Vegetable Vendors | పట్టణంలో రాత్రివేళ రోడ్డు పక్కనే కూరగాయల విక్రయాలు..

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Vegetable Vendors | పట్టణంలో రోజువారీగా కూరగాయల (vegetable vendors) విక్రయాలు జరుగుతుంటాయి. అయితే వసతుల లేమి కారణంగా విక్రయదారులు రోడ్డుపైనే కూరగాయలు అమ్ముతున్నారు. దీంతో అటు కొనుగోలుదార్లకు, విక్రయదారులకు ప్రమాదం పొంచి ఉంది.

Kamareddy Vegetable Vendors | ఏళ్ల తరబడి రైతుబజార్​ కోసం..

పట్టణంలో (Kamareddy City) కూరగాయల విక్రయదారులు ఏళ్ల తరబడిగా సరైన విక్రయస్థలం కోసం ఎదురుచూస్తున్నారు. రూ.50 లక్షలు వెచ్చించి నిర్మించిన రైతుబజార్ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. రూ.7 కోట్లతో మొదలు పెట్టిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ (Integrated Market) సముదాయం పిల్లర్ల స్థాయిలోనే ఆగిపోయింది. దీనిని పూర్తిస్థాయిలో నిర్మించి రైతులకు అందుబాటులోకి తేవాలన్న ఆలోచన అధికారులకు, ప్రజాప్రతినిధులకు లేకుండా పోయిందన్న విమర్శలున్నాయి. కామారెడ్డి పట్టణంలో వివిధ గ్రామాల నుంచి వచ్చే కూరగాయల రైతులు సరైన స్థలం లేక రోడ్లపై కూరగాయలు విక్రయిస్తున్నారు.

Kamareddy Vegetable Vendors | సీఎస్​ఐ మైదానం ఎదురుగా..

వారం సంత మినహా ప్రతిరోజు ప్రమాదకరంగా రోడ్లపైనే కూరగాయల విక్రయాలు జరుగుతున్నాయి. పట్టణంలోని కొత్త బస్టాండ్ ప్రాంతంలోని సీఎస్ఐ మైదానం(CSI Ground) ఎదురుగా పాత జాతీయ రహదారి పక్కనే కూరగాయల విక్రయాలు జరుగుతున్నాయి. గతంలో సీఎస్ఐ గ్రౌండ్​లో విక్రయాలు జరిగేవి. గ్రౌండులో ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేస్తుండటంతో రైతులకు ఇబ్బందిగా మారుతోంది.

ప్రధాన రహదారికి ఆనుకుని విక్రయాలు చేపడుతుండటంతో రాకపోకలకు ఇబ్బందిగా మారింది. ఉదయం నుంచి రాత్రి వరకు ఏదైనా వాహనం అదుపుతప్పితే నేరుగా కొనుగోలు, విక్రయదారులపైకి వెళ్లే అవకాశాలున్నాయి. అదే జరిగితే ప్రాణనష్టం పొంచి ఉంది. ఈ విషయాన్ని అధికారులు గుర్తించకపోవడం గమనార్హం. ప్రతిరోజు ఈ దారిన తిరిగే అధికారులు నిత్యం చూస్తున్నా రైతులకు ఏదైనా స్థలం కేటాయించకపోవడం అధికారుల నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపుతోంది. ఇకనైనా మున్సిపల్ అధికారులు స్పందించి రైతులకు ఏదైనా ప్రమాదం జరగకముందే సరైన స్థలాన్ని కేటాయించాలని రైతులు కోరుతున్నారు. అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి మరి.

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *