అక్షరటుడే, ఇందూరు: Viksit Bharat | పీఎం మోదీ (PM MODI) సారథ్యంలో దేశం అన్ని రంగాల్లో ముందడుగు వేస్తోందని ఎంపీ అర్వింద్ (Mp Arvind) అన్నారు. ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన లబ్ధిదారులకు నగరంలో ప్రోత్సాహక నిధులను అందజేశారు.
Viksit Bharat |12 ఏళ్ల పాలనలో..
దేశంలో అత్యధిక కాలం పాలన చేసిన ప్రధానుల్లో మోదీ ముందు వరుసలో నిలిచారన్నారు. ఆయన సారథ్యంలో దేశం అన్ని రంగాల్లో పురోగమిస్తోందని స్పష్టం చేశారు. ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన పథకం ఎంతోమంది యువతకు ఆసరాగా నిలుస్తోందని.. ఉపాధి అవకాశాలు కల్పిస్తుందన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో దేశంలో, రాష్ట్రంలో అమలవుతున్న అనేక పథకాల ద్వారా లబ్ధిపొందుతున్న వారు ఆనందంగా ఉన్నారన్నారు. ఈ సందర్భంగా ఆయన పలువురు లబ్ధిదారులకు ప్రోత్సాహక నిధులను అందజేశారు. అనంతరం ప్రధాని ప్రసంగాన్ని విన్నారు.
