అక్షరటుడే వెబ్డెస్క్: Assam Flood Hero | అధికారిక శిక్షణ గానీ, మోటారు పడవ గానీ లేకపోయినా.. కేవలం ఒక సాంప్రదాయ చెక్క పడవతో, స్థానిక జలమార్గాలపై ఉన్న పరిజ్ఞానంతో ఇటీవల అస్సాం వరదల్లో చిక్కుకుపోయిన దాదాపు 2,000 మంది ప్రాణాలను 25 సంవత్సరాల శ్రవణ్ కాపాడాడు. పదో తరగతి వరకు చదివి మానేసిన ఈ యువకుడు ఇప్పుడు స్థానిక హీరోగా ప్రశంసలు అందుకుంటున్నాడు.
Assam Flood Hero | ఆకస్మిక వరదలు
జులై 19న శివసాగర్ జిల్లా ( Sivasagar )లోని నజీరా సబ్-డివిజన్ను ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. దిఖో నది ఒడ్డున పెరిగిన శ్రవణ్కు నది ప్రవాహం, ప్రమాద సూచనలపై పూర్తి అవగాహన ఉంది. వరద నీరు తన ఇంటిని ముంచెత్తినప్పటికీ, తన కుటుంబం గురించి మాత్రమే ఆలోచించకుండా ఇతరులను రక్షించేందుకు ముందుకు కదిలాడు. “నా ఇంటిని కాపాడటానికి నేను వెనక్కి వెళ్లి ఉంటే, మిగిలిన వారిని రక్షించడానికి ఎవరూ మిగిలేవారు కాదు” అని ఆయన పేర్కొన్నారు.
Assam Flood Hero | ప్రాణాలను సైతం లెక్కచేయని వలంటీర్లు
స్వచ్ఛంద కార్యకర్తల బృందంతో కలిసి పనిచేస్తూ, శ్రవణ్ ఐదు గ్రామాలలో ఇళ్లపైకప్పులపై , మునిగిపోయిన ప్రాంతాలలో చిక్కుకుపోయిన పిల్లలు, మహిళలు, వృద్ధులు, రోగులను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ప్రమాదకరమైన వరద నీటిని పదేపదే దాటాడు. అస్సాంలోని మారుమూల ప్రాంతాలలో ప్రత్యేక సహాయక పరికరాల కొరతను ఇది స్పష్టం చేసింది. రాత్రిపూట చిమ్మచీకట్లో, బలమైన ప్రవాహాలలో పడవ బోల్తా పడే ప్రమాదం ఉన్నప్పటికీ లెక్కచేయకుండా వలంటీర్లు తమ సహాయక చర్యలను విజయవంతంగా కొనసాగించారు.
Assam Flood Hero | ప్రస్తుత వరద పరిస్థితి
గడచిన 24 గంటల్లో కొత్తగా ఎలాంటి మరణాలు నమోదు కాలేదని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు 82 మంది మృతి చెందారు. అయితే, శివసాగర్లోని దిఖో నది, గోలాఘాట్లోని ధన్సిరి నది ప్రమాద స్థాయికి మించి ప్రవహిస్తూనే ఉంది. అస్సాం స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (ASDMA) ప్రకారం.. గోలాఘాట్, శివసాగర్, చరైడియో, బజలి, ధేమాజీ, సోనిత్పూర్, జోర్హాట్ జిల్లాల్లోని 349 గ్రామాలు వరద ప్రభావితం కాగా, చరైడియో, శివసాగర్లు అత్యంత దెబ్బతిన్న ప్రాంతాలుగా నిలిచాయి.
ఇది కూడా చదవండి: Cauvery Water Dispute | కావేరీ నదీ జలాల వివాదం..అఖిలపక్ష సమావేశం నిర్వహించిన కర్ణాటక ప్రభుత్వం