Electric Bus Fire | ఎలక్ట్రిక్​ బస్సు దగ్ధం.. తప్పిన ప్రమాదం

ఎలక్ట్రిక్​ బస్సు దగ్ధమైంది. ఈ ఘటన కరీంనగర్​ జిల్లా అలుగునూరులో చోటు చేసుకుంది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Electric Bus Fire | కరీంనగర్ జిల్లా (Karimnagar District) అలుగునూర్ రాజీవ్ రహదారిపై ప్రమాదం జరిగింది. కరీంనగర్ నుండి హైదరాబాద్ వెళ్తున్న ఎలక్ట్రిక్​ బస్సులో షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తమవ్వడంతో ప్రయాణికులకు ప్రమాదం తప్పింది.

ఆర్టీసీ ఎలక్ట్రిక్​ బస్సు (RTC electric bus) ఆదివారం ఉదయం కరీంనగర్​ నుంచి బయలుదేరింది. అలుగునురు సమీపంలోకి రాగానే బస్సులో పొగలు రావడాన్ని డ్రైవర్​ గమనించాడు. వెంటనే అప్రమత్తం అయి బస్సును పక్కన ఆపాడు. అనంతరం అందులోని 39 మంది ప్రయాణికులు కిందకు దిగారు. ప్రయాణికులు కిందకు దిగిన వెంటనే క్షణాల్లో మంటలు బస్సు మొత్తం వ్యాపించాయి. దీంతో ఎలక్ట్రిక్​ బస్సు పూర్తిగా దగ్ధమైంది.

Electric Bus Fire | ప్రయాణికుల ఆందోళన

బస్సులో పొగలు రావడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. అయితే డ్రైవర్​ చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రాణాపాయం తప్పింది. బస్సును నిలిపిన తర్వాత డ్రైవర్​, స్థానికులు మంటలను ఆర్పడానికి యత్నించారు. అయితే అవి వేగంగా వ్యాపించి బస్సు పూర్తిగా కాలిపోయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలు ఆర్పి వేశారు. షార్ట్​ సర్క్యూట్ (Short circuit)​తో మంటలు చెలరేగినట్లు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..:Panipuri Food Poisoning | పానీపూరి తిని 20 మంది చిన్నారులకు అస్వస్థత

 

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *