అక్షరటుడే, వెబ్డెస్క్: Emergency Landing | శంషాబాద్ (Shamshabad)లో శనివారం ఉదయం ఓ విమానం అత్యవసర ల్యాండింగ్ అయింది. బెంగళూరు-నాగ్పూర్ ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది.
సమస్యను గుర్తించిన పైలట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారి సూచన మేరకు శంషాబాద్ విమానాశ్రయం (Shamshabad Airport)లో అత్యవసర ల్యాండింగ్ చేశారు. విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో ప్రయాణికలు ఊపిరి పీల్చుకున్నారు. ఆ సమయంలో ఫ్లైట్లో 126 మంది ప్యాసింజర్స్ ఉన్నారు.
Emergency Landing | రెండు విమానాలకు తప్పిన ప్రమాదం

శంషాబాద్ ఎయిర్పోర్టులో శుక్రవారం రెండు విమానాలకు ప్రమాదం తప్పింది. శుక్రవారం ఉదయం శంషాబాద్ నుంచి జగదలపూర్కు బయలుదేరిన ఇండిగో విమానం టేకాఫ్ అయిన వెంటనే సాంకేతిక లోపానికి గురైంది. అప్రమత్తమైన పైలట్.. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) అనుమతితో సురక్షితంగా రన్వేపై ల్యాండ్ చేశాడు. మరో ఘటనలో శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి శుక్రవారం మధ్యాహ్నం రాజమండ్రికి బయలుదేరిన విమానంలోనూ టేకాఫ్ అయిన తర్వాత ఇంజన్ సమస్యను గుర్తించారు. అనంతరం ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. శంషాబాద్లో తరచూ విమానాల్లో సాంకేతిక లోపాలు వెలుగు చూస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.
ఇది కూడా చదవండి..: Muski Lake Protection | ముష్కి చెరువు పరిరక్షణకు చర్యలు.. కంచె వేస్తున్న హైడ్రా


