అక్షరటుడే, వెబ్డెస్క్ : Kiran Rijiju | న్యూయార్క్లోని మాడిసన్ స్క్వేర్ గార్డెన్ వద్ద ఆర్ఎస్ఎస్ (RSS) చీఫ్ మోహన్ భగవత్ సమావేశం సమయంలో భారత జాతీయ జెండాను కాళ్లతో తొక్కడం, దానిని చింపివేయడం వంటి చర్యలకు పాల్పడిన నిరసనకారులు, ఖలిస్తానీ మద్దతుదారులను కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు హెచ్చరించారు. రాజకీయ విభేదాలు ఉండటం సహజమేనని, కానీ దేశాన్ని అవమానించడం మాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు.
ఆర్ఎస్ఎస్, బీజేపీ, ప్రభుత్వంపై విమర్శలు చేసే స్వేచ్ఛ ఉంటుందన్నారు. కానీ మా దేశాన్ని దూషించవద్దు అన్నారు. బాగా గుర్తుంచుకోండి, మా జెండాను, నా దేశాన్ని అవమానించకండి. దీనికి మీరు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అని ఎక్స్ వేదికగా ఆయన హెచ్చరించారు.
Kiran Rijiju | పోలీసులు చూస్తుండగా..
న్యూయార్క్లో మోహన్ భగవత్ (Mohan Bhagwat) పర్యటన సమయంలో కొందరు ఖలిస్థాని మద్దతుదారులు జాతీయ జెండాను అవమానించారు. పోలీసులు చూస్తుండగా.. ఓ వ్యక్తి జెండాను కాలికి కట్టుకొని ఊపాడు. అనంతరం దానిని చించి వేశారు. అంతేగాకుండా ఖలిస్తాన్ అనుకూలంగా నినాదాలు చేశారు. అయినా అమె పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వారిని అడ్డుకునే యత్నం చేయకపోవడం గమనార్హం. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి..: Owaisi Comments | హిందూ చట్టాన్ని రుద్దుతున్నారు : అసదుద్దీన్ ఒవైసీ