అక్షరటుడే, వెబ్డెస్క్: Modi Bishkek Visit | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) కిర్గిస్థాన్ చేరుకున్నారు. ఉజ్బెకిస్థాన్ పర్యటన ముగించుకున్న ఆయన కిర్గిస్థాన్లో బిష్కెక్కు వెళ్లారు. అక్కడ ఆయనకు ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. ప్రధాని సోమవారం ఉదయం బిష్కెక్లో నగరంలోని మహాత్మా గాంధీ విగ్రహం నివాళులు అర్పించారు.
Modi Bishkek Visit |ఎస్సీవో సదస్సులో..
అనంతరం పలు దేశాల ప్రతినిధులతో భేటీ అయ్యారు. భారతదేశంతో సన్నిహిత సంబంధాలున్న ఒక బృందాన్ని కలిశానని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వీరిలో ప్రముఖ ప్రవాస భారతీయులు, పర్యావరణం పట్ల ఆసక్తి ఉన్నవారు, యోగా ఔత్సాహికులు, విద్యావేత్తలు, ఐటెక్ పూర్వ విద్యార్థులు, పరిశోధకులు ఇంకా పలువురు ఉన్నారు. యోగా సాధకులలో ఒకరు అహ్మదాబాద్లో జరిగిన ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్లో పాల్గొని పతకం గెలుచుకున్నారని ప్రధాని పేర్కొన్నారు. ప్రధాని మోదీ రేపు బిష్కెక్లో జరిగే 26వ ఎస్సీవో సదస్సులో పాల్గొంటారు.
ఇది కూడా చదవండి..: Kiran Rijiju | జాతీయ పతాకానికి అవమానం.. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఆగ్రహం