Manipur Firing | మణిపూర్​లో రెండు వర్గాల మధ్య కాల్పులు.. ఒకరి మృతి

మణిపూర్​లో రెండు నాగా సాయుధ వర్గాల మధ్య కాల్పులు చోటు చేసుకోగా.. ఒకరు మృతి చెందారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Manipur Firing | మణిపూర్​లో మరోసారి హింస చెలరేగింది. నోనీ జిల్లా ఖుమ్‌జీ ప్రాంతంలో రెండు నాగా సాయుధ వర్గాల మధ్య కాల్పులు చోటు చేసుకోగా.. ఒకరు మృతి చెందారు. మరో ఐదుగురు గాయపడ్డారు.

జెలియాంగ్‌రోంగ్ యునైటెడ్ ఫ్రంట్ (ZUF)కు చెందిన ZUF-J, ZUF-K వర్గాల మధ్య ఒక మారుమూల అటవీ ప్రాంతంలో శనివారం కాల్పులు చోటు చేసుకున్నాయి. జెలియాంగ్‌రోంగ్ ప్రజలు నివసించే ప్రాంతాలపై ఆధిపత్యం, నియంత్రణ కోసం నాగా వర్గాల మధ్య నెలకొన్న దీర్ఘకాలిక ఉద్రిక్తతలు సాయుధ వైరుధ్యాలలో ఈ రెండు వర్గాలు పాల్గొంటున్నాయి. భద్రతా సిబ్బంది ఆ ప్రాంతానికి చేరుకుని పరిస్థితిని అంచనా వేసే కొద్దీ మృతుల సంఖ్య మారవచ్చని వర్గాలు తెలిపాయి.

Manipur Firing | అటవీ ప్రాంతంలో..

జనావాసాలకు దూరంగా మారుమూల అటవీ ప్రాంతంలో ఈ కాల్పులు జరిగాయని సమాచారం. భౌగోళిక పరిస్థితుల కారణంగా అక్కడికి చేరుకోవడం సవాలుగా మారింది. NSCN-IM, ZUF మధ్య ఉన్న దీర్ఘకాలిక వైరుధ్యం, అలాగే ZUFలో అంతర్గత వర్గ విభేదాల నేపథ్యంలో ఈ ఘర్షణ చోటుచేసుకుందని సమాచారం. మాజీ NSCN-IM సభ్యుల విభజన తర్వాత 2011లో జెలియాంగ్‌రోంగ్ యునైటెడ్ ఫ్రంట్ (ZUF) ఏర్పడింది.

దీనిని కూడా చదవండి : Tree Dispute | వేప చెట్టు కోసం గొడవ.. ఇద్దరి మృతి

 

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *