అక్షరటుడే, వెబ్డెస్క్: Meerut Incident | ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని మీరట్లో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడి మోజులో పడి ఓ మహిళ తన కుమారుడిని హత్య చేయించింది.
తన ఆరేళ్ల కొడుకుతో నివాసం ఉంటున్న గుర్ప్రీత్ కౌర్ అనే మహిళకు ప్రైవేట్ బ్యాంక్ మేనేజర్ అర్పిత్ శర్మతో వివాహేతర సంబంధం ఏర్పడింది. తమ సంబంధానికి అడ్డంకిగా మారాడనే కారణంతో, అతడిని హత్య చేయాలని పథకం వేసింది. ఈ మేరకు అతడిని ప్రియుడి కారులో పంపింది. అనంతరం అర్పిత్ శర్మ బాలుడి గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం హస్తినాపూర్ ప్రాంతంలోని అటవీ ప్రాంతంలో మృతదేహాన్ని పడేశాడు.
Meerut Incident | నానమ్మ ఫిర్యాదు..
బాలుడి నాయనమ్మ బహసుమా తన మనవడు కనిపించడం లేదని ఈ నెల 16న పోలీసులకు ఫిర్యాదు చేసింది. శర్మ తన మనవడిని వాగన్ఆర్ కారులో తీసుకువెళ్లాడని, బాలుడి భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఆమె ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసి, తప్పిపోయిన బాలుడి ఆచూకీ కనుగొనేందుకు పలు పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. సీసీటీవీ ఫుటేజ్, నిఘా డేటా, ఇతర సాంకేతిక ఆధారాల సహాయంతో పోలీసులు ముజఫర్నగర్ జిల్లా (Muzaffarnagar District) నివాసి అయిన శర్మను గుర్తించారు. విచారణలో, అతను బాలుడిని సమీపంలోని పొలానికి తీసుకెళ్లి, హత్య చేసి, మృతదేహాన్ని దాచిపెట్టినట్లు అంగీకరించినట్లు సమాచారం.
Meerut Incident | నిందితుల అరెస్ట్

తన ప్రియుడు బాలుడిని చంపే ఉద్దేశంతో తీసుకువెళుతున్నాడని కౌర్కు తెలుసని, ఆమె ఈ కుట్రలో పాలుపంచుకుందని పోలీసులు గుర్తించారు. దర్యాప్తులో సేకరించిన డిజిటల్ ఆధారాలు, ఇద్దరు నిందితుల మధ్య జరిగిన సంభాషణలతో సహా, నేరంలో వారి ప్రమేయాన్ని ధృవీకరించాయని మీరట్ రూరల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అభిజీత్ కుమార్ తెలిపారు. ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇది కూడా చదవండి..: Wife Torture Case | బిడ్డల ముందే అమానుషం.. భార్యకు గుండు గీసిన భర్త