అక్షరటుడే, వెబ్డెస్క్ : Karnataka Border | తెలంగాణ – కర్ణాటక సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కర్ణాటకలోని బీదర్ జిల్లా నుంచి సేకరించిన చెత్తను తెలంగాణ సరిహద్దు గ్రామాల సమీపంలో పడేస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
సంగారెడ్డి జిల్లా (Sangareddy District)లోని న్యాల్కల్ మండలం బీదర్కు 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడి నుంచి సేకరించిన చెత్తను మండలంలోని పలు గ్రామాల సమీపంలో పడేస్తున్నారు. దీంతో స్థానికులు మంగళవారం చెత్త వాహనాలను అడ్డుకొని నిరసన తెలిపారు. చెత్తతో మండలంలోని పలు గ్రామాల్లో తీవ్ర దుర్వాసన వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
Karnataka Border | అడ్డుకున్న గ్రామస్తులు
న్యాల్కల్ మండలం మల్గి గ్రామ ప్రజలు ఆందోళన చేశారు. కర్ణాటక (Karnataka) నుంచి చెత్త తీసుకొచ్చిన వాహనాలను అడ్డుకున్నారు. దీంతో చెత్త లోడుతో వందలాది వాహనాలు నిలిచిపోయాయ. తమ మా గ్రామాలను చెత్త కుప్పలుగా మార్చొద్దు అంటూ ప్రజలు నిరసన తెలిపారు. చెత్త వాహనాలను అడ్డుకుంటే బీదర్ పోలీసులు బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడి నుంచి డంపింగ్ యార్డ్ తీసివేయాలని డిమాండ్ చేశారు. చెత్తతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి..: ACB Raids | జలమండలి జీఎం ఇంట్లో ఏసీబీ సోదాలు.. ఆస్తులు చూసి షాకైన అధికారులు


