అక్షరటుడే, వెబ్డెస్క్ : Firecracker Factory Blast | మధ్య ప్రదేశ్ (Madhya Pradesh)లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బాణాసంచ పరిశ్రమలో పేలుడు సంభవించడంతో నలుగురు కార్మికులు చనిపోయారు.
మధ్యప్రదేశ్ రాష్ట్రం దేవాస్లోని బాణాసంచా పరిశ్రమలో గురువారం పేలుడు చోటు చేసుకుంది. టోంక్ కలాన్ ప్రాంతంలోని యూనిట్లో జరిగిన ఈ అగ్నిప్రమాదంలో పలువురు మృతి చెందినట్లు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అగ్ని మాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
Firecracker Factory Blast | అక్రమంగా తయారీ
ఆ ఫ్యాక్టరీలో అక్రమంగా బాణసంచా తయారు చేస్తున్నారని, గురువారం భారీ పేలుడు సంభవించిందని స్థానికులు పేర్కొన్నారు.ఫ్యాక్టరీలో ఏ ఉత్పత్తులను తయారు చేస్తున్నారనే దానిపై వారు వెంటనే స్పష్టత ఇవ్వలేదు. పేలుడు తీవ్రతకు కార్మికులు చాలా దూరం ఎగిరిపడ్డారు. సమీపంలోని ఇళ్లు కూడా కంపించాయి. ఆ ఫ్యాక్టరీలో మహిళలతో సహా 200 మందికి పైగా కార్మికులు పనిచేస్తున్నారు. ఆ యూనిట్ అక్రమంగా నడుస్తోందని, పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ అధికారులు చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు ఆరోపించారు.
Firecracker Factory Blast | దర్యాప్తునకు ఆదేశాలు
ఈ ఘటనపై మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ (CM Mohan Yadav) స్పందించారు. పేలుడుపై దర్యాప్తునకు ఆదేశించినట్లు పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక్కొక్కరికి రూ.4 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని, గాయపడిన వారికి ఉచిత చికిత్స అందించాలని సూచించారు.
ఇది కూడా చదవండి..: Red Fort Bomb Blast|ఎర్రకోట బాంబు పేలుడు కేసు.. 10 మంది ఉగ్రవాదులపై ఎన్ఐఏ భారీ ఛార్జిషీట్


