అక్షరటుడే, డిచ్పల్లి(మోపాల్): Mopal Police Arrest | నిజామాబాద్ జిల్లా మోపాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గ్రామపంచాయతీ సర్పంచులు, జీపీ సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగులను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న వ్యక్తిని మోపాల్ పోలీసులు అరెస్టు చేశారు.
Mopal Police Arrest | అట్రాసిటీ కేసులు పెట్టిస్తానని..
కేసు వివరాల ప్రకారం, ప్రాజెక్ట్ రామడుగు గ్రామానికి చెందిన జంగం బస్వరాజ్ తనను “మన దునియా” పత్రిక రిపోర్టర్గా పరిచయం చేసుకొని, గ్రామపంచాయతీ కార్యాలయాలకు తరచుగా వెళ్లి సర్పంచులు, జీపీ సిబ్బంది, ఇతరులను బెదిరిస్తూ డబ్బులు డిమాండ్ చేసేవాడు.
డబ్బులు ఇవ్వకపోతే తప్పుడు వార్తలు ప్రచురిస్తానని, ACB కేసుల్లో ఇరికిస్తానని, ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేస్తానని, ఉద్యోగాల నుంచి సస్పెండ్ చేయిస్తానని, SC/ST అట్రాసిటీ కేసులు పెట్టిస్తానని బెదిరించి పలుమార్లు ఫోన్పే ద్వారా, నగదు రూపంలో డబ్బులు వసూలు చేసినట్లు విచారణలో వెల్లడైంది.
Mopal Police Arrest | మొబైల్ లొకేషన్ ఆధారంగా
ఠాణాకుర్దు గ్రామ సర్పంచి ఫిర్యాదు మేరకు మోపాల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది.. అయినా కూడా, జీపీ కార్యదర్శి విధులు నిర్వహిస్తున్న సమయంలో నిందితుడు బెదిరించి రూ.10,000/- డిమాండ్ చేసినట్లు వెలుగులోకి వచ్చింది.
నిందితుడి మొబైల్ లొకేషన్ ఆధారంగా శుక్రవారం (మే 22) అదుపులోకి తీసుకొని నిందితుడి వద్ద నుంచి ఫోన్పే లావాదేవీలకు ఉపయోగించిన మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు.
విచారణలో నిందితుడు ఇతర గ్రామాల సర్పంచులను కూడా ఇదే విధంగా బెదిరించి డబ్బులు వసూలు చేసినట్లు ఒప్పుకొన్నాడు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి న్యాయస్థానం ఎదుట హాజరుపర్చారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.


