అక్షరటుడే, వెబ్డెస్క్ : Morena Train Accident | మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లోని మొరేనా జిల్లాలో ఆదివారం ఒక విషాదకరమైన రైలు ప్రమాదం జరిగింది. ఖజురహో-ఉదయపూర్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగాయన్న వదంతులు వ్యాపించాయి. దీంతో ప్రయాణికులు చైన్ లాగి కిందకు దూకారు.
వదంతులు ప్రయాణికుల ప్రాణాలు తీశాయి. రైలులో మంటలు చెలరేగాయని భయంతో కిందకు దూకేయగా.. అదే సమయంలో వచ్చిన మరో రైలు వారిని ఢీకొంది. ప్రయాణికులు కిందకు దిగిన తర్వాత పక్కన ఉన్న మరో ట్రాక్పై గుమి గూడారు. ఆ మార్గంలో వచ్చిన పాతాళ్కోట్ ఎక్స్ప్రెస్ వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు చనిపోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మోరేనాలోని హేతంపూర్ స్టేషన్ సమీపంలో జరిగింది.
Morena Train Accident | సహాయక చర్యలు
ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే పోలీసులు, రైల్వే పరిపాలన అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇప్పటివరకు ముగ్గురు మహిళలు, ఒక చిన్నారి మృతదేహాలను వెలికితీశారు. ఈ ఘటన ఆదివారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది. మరణించిన వారిని అఫ్రీన్ (ఆగ్రా), ఆమె నాలుగేళ్ల కుమారుడు అసద్ ఖాన్, శకుంతల (ఆగ్రా), విర్మా దేవి (రాజస్థాన్)గా గుర్తించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపడుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.
Dhoulpur, Rajasthan: A mobile phone reportedly caught fire aboard the Udaipur–Khajuraho Express near Hetampur railway station in Madhya Pradesh, prompting the train to stop and passengers to disembark hurriedly. While people were on the track, a second train arrived on an… pic.twitter.com/A64QxkQZ5J
— IANS (@ians_india) June 14, 2026
దీనిని కూడా చదవండి : Mamata Banerjee Notice | మమతా బెనర్జీకి లీగల్ నోటీసు.. పరువు నష్టం దావా హెచ్చరిక!