RTA Bus Seizure | ఆర్టీఏ అధికారుల తీరుతో ప్రయాణికుల అవస్థలు

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్: RTA Bus Seizure | ఆర్టీఏ అధికారుల తీరుతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ ఘటన హైదరాబాద్​ (Hyderabad) నగరంలో చోటు చేసుకుంది.

ఖైరతాబాద్ ఆర్టీఏ అధికారులు (Khairatabad RTA Officers) ఓ ప్రైవేట్​ ట్రావెల్స్​ బస్సును సీజ్​ చేశారు. హైదరాబాద్ నుండి రాజస్థాన్ వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును శుక్రవారం రాత్రి తనిఖీ చేశారు. నిబంధనలు, అనుమతులు సక్రమంగా లేకపోవడంతో దానిని సీజ్​చేశారు. అందులో ఉన్న ప్రయాణికులతో సహా బస్సును ఖైరతాబాద్​ ఆర్టీఏ కార్యాలయానికి తరలించారు.

RTA Bus Seizure | ఉదయం వరకు..

RTA Bus Seizure

బస్సును సీజ్​ చేసిన అధికారులు ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదు. దీంతో 50 మంది ప్రయాణికులు ఉదయం వరకు కార్యాలయంలోనే నిరీక్షించారు. దాదాపు 10 గంటలుగా తిండి, వాష్‌రూమ్స్ లేక ప్రయాణికులు బస్సులోనే తీవ్ర అవస్థలు పడ్డారు. బస్సును సీజ్​ చేసిన అధికారులు తమను మరో బస్సులో పంపించాలని ప్రయాణికులు కోరారు. అయినా వారి గురించి ఎవరు పట్టించుకోలేదు. దీంతో అధికారుల తీరుపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారితో వాగ్వాదం చేశారు.

ఇది కూడా చదవండి..: KBR Park Traffic Restrictions | నగరవాసులకు అలర్ట్​.. రేపు కేబీఆర్​ పార్క్​ పరిసరాల్లో ట్రాఫిక్​ ఆంక్షలు

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *