అక్షరటుడే, వెబ్డెస్క్ : Telegram Ban India | కేంద్ర ప్రభుత్వం (Central Government) సంచలన నిర్ణయం తీసుకుంది. జూన్ 21న జరగనున్న నీట్-యూజీ 2026 పునఃపరీక్షకు ముందు పరీక్షలకు సంబంధించిన మోసాలు, తప్పుడు సమాచారాన్ని అరికట్టడానికి భారతదేశంలో టెలిగ్రామ్పై తాత్కాలిక ఆంక్షలు విధించింది.
గతంలో నిర్వహించిన నీట్ పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ (NEET Exam Paper Leak) అయిన విషయం తెలిసిందే. దీంతో ఎన్టీఏ పరీక్షను రద్దు చేసింది. ఈ నెల 21న మళ్లీ పరీక్ష నిర్వహించనుంది. అయితే మరోసారి ఎలాంటి అవకతవకలు జరగకుండా కేంద్రం చర్యలు చేపట్టింది. ఈ మేరకు టెలిగ్రామ్పై తాత్కాలిక ఆంక్షలు విధించింది. ఈ 22 వరకు యాప్పై బ్యాన్ విధించింది.
Telegram Ban India | స్వాగతించిన ఎన్టీఏ
కేంద్రం నిర్ణయాన్ని జాతీయ పరీక్షల ఏజెన్సీ (ఎన్టీఏ) స్వాగతించింది. ఈ చర్య అవసరమైనదని ఎన్టీఏ అభివర్ణించింది. ఎన్టీఏ ప్రకటన ప్రకారం, ఏజెన్సీ సిఫార్సుల మేరకు ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (), భారతదేశంలో టెలిగ్రామ్ యాక్సెస్పై జూన్ 22 వరకు తాత్కాలిక ఆంక్షలు విధించింది. జూన్ 30 వరకు భారతదేశంలో దాని మెసేజ్-ఎడిటింగ్ ఫీచర్ను నిలిపివేయాలని కూడా ప్రభుత్వం ఆ ప్లాట్ఫామ్ను ఆదేశించింది.వైద్య ప్రవేశ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులను మోసం చేయడానికి, ప్రశ్నపత్రాల లీకేజీల గురించి తప్పుడు వాదనలను వ్యాప్తి చేయడానికి వ్యవస్థీకృత మోసాల నెట్వర్క్లు ఈ ప్లాట్ఫామ్ను దుర్వినియోగం చేయకుండా నిరోధించడమే ఈ చర్యల లక్ష్యమని ఎన్టీఏ తెలిపింది.
ఇది కూడా చదవండి..: E100 Ethanol Fuel | ఇక వంద శాతం ఇథనాల్ ఇంధనం!