అక్షరటుడే, వెబ్డెస్క్: CMR Green IPO | సీఎంఆర్ గ్రీన్ టెక్నాలజీస్ లిమిటెడ్ కంపెనీని 2005లో ఆగస్టులో గ్రాండ్ మెటల్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో స్థాపించారు. హర్యానాలోని ఫరీదాబాద్లో ప్రధాన కార్యాలయం ఉన్న ఈ కంపెనీ.. 2021లో తన ప్రస్తుత పేరును స్వీకరించింది. ఇది స్క్రాప్ లోహాన్ని అధిక నాణ్యత గల పారిశ్రామిక ముడి పదార్థాలుగా మారుస్తూ భారతదేశ రీసైక్లింగ్ పరిశ్రమలో కీలకంగా ఎదిగింది.
CMR Green IPO | నాన్ ఫెర్రస్ మెటల్ రీసైక్లర్..
సీఎంఆర్ గ్రీన్ టెక్నాలజీస్ (CMR Green Technologies) కంపెనీ ప్రధానంగా అల్యూమినియం, జింక్ పదార్థాలపై దృష్టి సారించి, ఫెర్రస్ కాని లోహ స్క్రాప్ పదార్థాలను సేకరించి ప్రాసెస్ చేస్తోంది. అధునాతన ద్రవీకరణ, శుద్ధి పద్ధతులను ఉపయోగించి ఆటోమోటివ్ , ఇంజినీరింగ్ పరిశ్రమలకు అనువైన అనేక రకాలను ఉత్పత్తి చేస్తోంది. ద్రవ రూపంలో ఉన్న అల్యూమినియం మిశ్రమ లోహ ఉత్పత్తులను మార్కెట్కు అందించడం ఈ కంపెనీ ప్రత్యేకత. దీనివల్ల తిరిగి ద్రవీకరించే ప్రక్రియను నివారించడం ద్వారా సంస్థ యొక్క వినియోగదారులు ఇంధన ఖర్చులను ఆదా చేసుకోగలుగుతున్నారు. 2025 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి రీసైకిల్ చేసిన అల్యూమినియం ఉత్పత్తుల తయారీలో తన సమీప దేశీయ పోటీదారు కంటే నాలుగు రెట్లు అధిక స్థాపిత సామర్థ్యాన్ని ఈ కంపెనీ కలిగి ఉంది.
CMR Green IPO | రూ. 631 కోట్లు సమీకరించాలన్న లక్ష్యంతో..
ప్రైమరీ మార్కెట్ నుంచి రూ. 631 కోట్లు సమీకరించాలన్న లక్ష్యంతో సీఎంఆర్ గ్రీన్ టెక్నాలజీస్ లిమిటెడ్ కంపెనీ పబ్లిక్ ఇష్యూకు వస్తోంది. అయితే ఈ ఇష్యూ ద్వారా కంపెనీకి ఎలాంటి రాబడి లభించదు. ఇది కేవలం ఆఫర్ ఫర్ సేల్ . వాటాదారులు రూ. 2 ముఖవిలువ కలిగిన 3,28,58,323 షేర్లను విక్రయించడం ద్వారా ఈ నిధులను సమీకరించుకుంటారు.
ప్రైస్ బ్యాండ్ : కంపెనీ ఒక్కో ఈక్విటీ షేరు ధరను రూ. 182 నుంచి రూ. 192 గా నిర్ణయించింది. ఒక లాట్లో 78 షేర్లున్నాయి. రిటైల్ ఇన్వెస్టర్లు ఒక లాట్ కోసం గరిష్ట ప్రైస్ బ్యాండ్ వద్ద రూ. 14,976తో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. గరిష్టంగా 13 లాట్ల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
కోటా : క్యూఐబీలకు 50 శాతం, ఎన్ ఐఐలకు 15 శాతం, రిటైల్ ఇన్వెస్టర్లకు 35 శాతం షేర్లను కేటాయించనున్నారు.
గమనించాల్సిన తేదీలు : ఐపీవో సబ్స్క్రిప్షన్ జూన్ 3 న ప్రారంభమవుతుంది. 5వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. జూన్ 8 న షేర్ల కేటాయింపులు ఉంటాయి. కంపెనీ షేర్లు 10వ తేదీన బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో లిస్టవుతాయి.
జీఎంపీ : కంపెనీ షేర్లకు గ్రే మార్కెట్లో డిమాండ్ ఉంది. ఒక్కో షేరు రూ. 49 ప్రీమియంతో ట్రేడ్ అవుతోంది. అంటే లిస్టింగ్ సమయంలో ఇన్వెస్టర్లకు 25 శాతం వరకు లాభాలు వచ్చే అవకాశాలున్నాయి.
ఇది కూడా చదవండి..:India Stock Market | 7వ స్థానానికి పడిపోయిన భారత స్టాక్ మార్కెట్


