అక్షరటుడే, వెబ్డెస్క్ : RTC Strike | ఆర్టీసీ కార్మికుల (RTC Workers) సమ్మెతో బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో సమ్మెను విరమించాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) కోరారు.
ఆర్టీసీ సంస్థ పరిరక్షణ, ప్రజా శ్రేయస్సు దృష్ట్యా ఆర్టీసీ సమ్మె విరమించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. సమ్మె సమస్యకు పరిష్కారం కాదని పేర్కొన్నారు. ప్రభుత్వం నలుగురు అధికారులతో కమిటీ ఏర్పాటు చేసిందని చెప్పారు. నాలుగు వారాల్లో ఈ కమిటీ నివేదిక ఇస్తుందన్నారు. కమిటీల పేరుతో కాలయాపన చేస్తామనడం సరికాదన్నారు. కార్మికులు లేవనెత్తిన 32 అంశాల్లో 29 అంశాలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి వ్యతిరేకత లేదని పేర్కొన్నారు. అన్ని వెంటనే పరిష్కారం అయ్యే అంశాలని తెలిపారు.
RTC Strike | ఒకటో తేదినే జీతాలు
ఆర్టీసీ విలీనం, గుర్తింపు సంఘాల ఎన్నికలు రెండు పెండింగ్లో ఉన్నాయని మంత్రి తెలిపారు. ఈ అంశాల్లో కొన్ని సాంకేతిక సమస్యలు ఉన్నాయని, వాటిపై చర్చించాల్సి ఉందన్నారు. దీనిపై కమిటీ అధ్యయనం చేసిన అనంతరం ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి దగ్గర చర్చిస్తామన్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం ఆలస్యం అయిన ఉద్యోగులకు ఒకటో తారీఖు జీతాలు చెల్లిస్తున్నట్లు తెలిపారు.

RTC Strike | సమస్యలు పరిష్కరించాం
తమ ప్రభుత్వం ఏర్పడగానే 2017 పీఆర్సీ క్లియర్ చేశామని, పెండింగ్ డీఏలు లేకుండా చేశామన్నారు. రూ.1205 కోట్లు ఉన్న పీఎఫ్ బకాయిలను రూ.600 కోట్లకు తగ్గించినట్లు చెప్పారు. రూ.690 కోట్లు ఉన్న సీసీఎస్ బకాయిలను రూ.300 కోట్లకు తగ్గించామని తెలిపారు. ఉద్యోగులపై పనిభారం తగ్గించడానికి త్వరలోనే 4,538 పోస్టులను భర్తీ చేస్తామన్నారు. మిగతా అన్ని అంశాలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇతర రూపాల్లో నిరసన తెలపాలని, సమ్మెను విరమించాలని ఆయన కోరారు.
ఇది కూడా చదవండి..: Vote for Cash Case | సుప్రీంకోర్టులో నేడు ఓటుకు నోటు కేసు విచారణ

