అక్షరటుడే, వెబ్డెస్క్ : Vote for Cash Case | దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసులో సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy) ప్రధాన నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే.
బీఆర్ఎస్ హయాంలో ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో నామినేటేడ్ ఎమ్మెల్యే స్టిఫెన్ సన్ ఓటు కొనుగోలుకు యత్నించారనే ఆరోపణలపై రేవంత్రెడ్డిపై కేసు నమోదైంది. ఈ కేసులో ఆయన గతంలో జైలుకు కూడా వెళ్లారు. ప్రస్తుతం బెయిల్పై బయట ఉన్నారు.
Vote for Cash Case | మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని..
ఓటుకు నోటు కేసును ఏసీబీ విచారిస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన రేవంత్రెడ్డి ప్రస్తుతం సీఎంగా ఉండటంతో.. విచారణ పారదర్శకంగా జరగదని ఓ వ్యక్తి సుప్రీంకోర్టు (Supreme Court)ను ఆశ్రయించాడు.ఈ కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరారు. దీనిపై నేడు మధ్యాహ్నం విచారణ జరగనుంది. అనంతరం సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న ఉత్కంఠ నెలకొంది. ఇతర రాష్ట్రానికి కేసును బదిలీ చేస్తుందా.. లేదా సీబీఐకి అప్పగిస్తుందా.. అనేది చూడాలి. ఈ కేసులో బెయిల్ ఎత్తివేస్తే రేవంత్రెడ్డి సీఎం పదవి పోతుందని బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు.

ఇది కూడా చదవండి..: Kaleshwaram Case | కాళేశ్వరం కేసు.. కేసీఆర్, హరీశ్రావుకు హైకోర్టులో ఊరట

