అక్షరటుడే వెబ్డెస్క్: Loan Money Fraud | భవన నిర్మాణం కోసం బ్యాంకులో పొందిన లోన్ డబ్బులు సైబర్ నేరగాళ్ల ( cybercrime) చేతికి చిక్కాయి. బాధితురాలి ప్రమేయం లేకుండానే ఆమె ఖాతా నుంచి లక్షల రూపాయలు మాయమైన ఘటన షాద్నగర్ పరిధిలోని కొత్తూరు మున్సిపాలిటీ మినీ సిటీ కాలనీలో చోటుచేసుకుంది.
Loan Money Fraud | ఏం జరిగిందంటే..
కొత్తూరులోని మినీ సిటీ కాలనీకి చెందిన అన్న మానస, సురేష్ బాబులు ఇంటి నిర్మాణం కోసం ‘వాస్తు హౌసింగ్’ సంస్థ నుంచి రూ. 74 లక్షల రుణాన్ని పొందారు. ఇందులో భాగంగా, మే 12న రెండో విడతగా మంజూరైన రూ. 26 లక్షలను కొత్తూరులోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉన్న మానస ఖాతాలో జమ చేశారు. ఈ నెల 9న అవసర నిమిత్తం డబ్బులు డ్రా చేసేందుకు బ్యాంకుకు వెళ్లిన మానసకు షాకింగ్ నిజం తెలిసింది. ఖాతాలో ఉండాల్సిన రూ. 26 లక్షలకు గానూ కేవలం రూ. 748 మాత్రమే ఉన్నాయి. కంగారుపడిన ఆమె బ్యాంకు స్టేట్మెంట్ పరిశీలించగా, మే 12 నుంచి జూన్ 9 మధ్య గుర్తు తెలియని వ్యక్తులు తన అకౌంట్ నుంచి రూ. 1,000 నుంచి రూ. 49,000 చొప్పున పలు విడతలుగా మొత్తం రూ. 14,68,009 డ్రా చేసినట్లు గుర్తించారు.
Loan Money Fraud | మొత్తం రూ. 16,78,009 మాయం..
అంతేకాకుండా, ఆమె కరెంటు ఖాతా నుంచి కూడా జూన్ 5 నుంచి 9 తేదీల మధ్య మరో రూ. 2,10,000 నగదు బదిలీ అయినట్లు తేలింది. ఇలా మొత్తం రూ. 16,78,009 తన ఖాతా నుంచి మాయమైనట్లు గ్రహించిన మానస వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్లైన్కు ఫిర్యాదు చేశారు.
Loan Money Fraud | పోలీసుల దర్యాప్తు..
బాధితురాలు మానస ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొత్తూరు పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ నరసయ్య కథనం ప్రకారం, నిందితులను పట్టుకునేందుకు దర్యాప్తు వేగవంతం చేశామని తెలిపారు. లోన్ డబ్బులు ఇలా మాయం కావడంతో స్థానికంగా ఆందోళన వ్యక్తమవుతోంది.
ఇది కూడా చదవండి: Petrol Bunk Bulk Purchases | కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్ బంకుల్లో బల్క్ కొనుగోళ్లకు బ్రేక్
